New Zealand T20 Series: ఈ నెలలో న్యూజిలాండ్‌తో జరగనున్న టీ20 సిరీస్ కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) టీమ్ ఇండియాను ప్రకటించింది. ఈ సిరీస్‌లోనూ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను ఎంపిక చేయలేదు. హార్దిక్ పాండ్యానే జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.


కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ కూడా దూరం
న్యూజిలాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌కు వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్, స్పిన్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్‌లను ఎంపిక చేయలేదు. వ్యక్తిగత కారణాల రీత్యా ఈ ఇద్దరు ఆటగాళ్లు అందుబాటులో లేరని బీసీసీఐ ఓ ప్రకటన ద్వారా తెలిపింది.


పృథ్వీ షా రీ-ఎంట్రీ
న్యూజిలాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌లో 29 ఏళ్ల వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ జితేష్ శర్మ టీమ్ ఇండియా రిజర్వ్ వికెట్ కీపర్‌గా వ్యవహరించనున్నాడు. గతంలో సంజు శామ్సన్ గాయపడటంతో శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లో కూడా అతనికి అవకాశం లభించింది. అదే సమయంలో టీమిండియా పునరాగమనంపై చాలా కాలంగా కసరత్తు చేస్తున్న ఓపెనర్ పృథ్వీ షాకు కూడా న్యూజిలాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌లో అవకాశం దక్కింది.


రవీంద్ర జడేజా కూడా
టీ20 జట్టులోకి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను బోర్డు మరోసారి ఎంపిక చేయలేదు. అయితే ఈ ఇద్దరు వెటరన్లను ఎంపిక చేయకపోవడానికి గల కారణాలను బీసీసీఐ వెల్లడించలేదు. అదే సమయంలో రవీంద్ర జడేజా కూడా ఫిట్‌గా లేడు. ఈ కారణంగా అతనికి జట్టులో చోటు దక్కలేదు.


న్యూజిలాండ్‌తో సిరీస్‌ కోసం టీం ఇండియా
హార్దిక్ పాండ్యా (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, జితేష్ శర్మ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, శివమ్ మావి, పృథ్వీ షా మరియు ముఖేష్ కుమార్.


ఇండియా న్యూజిలాండ్ టీ20 సిరీస్ షెడ్యూల్
భారత్ vs న్యూజిలాండ్, మొదటి T20 జనవరి 27వ తేదీ - రాంచీ


భారత్ vs న్యూజిలాండ్, రెండో T20 జనవరి 29వ తేదీ - లక్నో


ఇండియా vs న్యూజిలాండ్, మూడో, చివరి T20 ఫిబ్రవరి 1వ తేదీ - అహ్మదాబాద్