Suryakumar Yadav ruled out for Anantapur Dulip Trophy match :  భారత 20 20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ సీజన్ ప్రారంభంలోనే దులీప్ ట్రోఫీ ఆడుతాడా లేదా అన్న సందేహాలు  ప్రారంభమయ్యాయి.  ఇప్పటికే దులీప్ ట్రోఫీ ఆడే టీం సభ్యులు అనంతపురం క్రికెట్ మైదానానికి చేరుకున్నారు. వారితోపాటు రావలసిన సూర్య కుమార్ యాదవ్ ఇప్పటివరకు జట్టు సభ్యులలో ఎక్కడ కనిపించలేదు. అనుకున్న షెడ్యూల్ ప్రకారం అనంతపురం కు చేరుకున్న టీం సభ్యులు సూర్యకుమార్ యాదవ్ మాత్రం ఇంకా రాలేదని ఇప్పటికే ధ్రువీకరించాయి. 


సూర్యకుమార్‌కు గాయం ! 


టీం ఇండియా టెస్ట్ జట్టులో చోటు కోసం సూర్యకుమార్ యాదవ్ దులీప్ ట్రోఫీపై భారీ అంచనాలని పెట్టుకున్నాడు. టీమిండియా టెస్ట్ మ్యాచ్‌లో  ఆడాలంటే  దులీప్ ట్రోఫీలో  రాణించి టెస్టుల్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని భావించిన సూర్య కుమార్ యాదవ్ కు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తమిళనాడులోని కోయంబత్తూరులో బుచ్చి బాబు ఇన్విటేషనల్ టోర్నమెంట్‌లో గత వారం ముంబయి తో జరిగిన  మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ చేతికి గాయం కారణంగా దులీప్ ట్రోఫీ మొదటి రౌండ్‌కు దూరమయ్యాడు. దీంతో మున్ముందు ఆడాల్సిన మ్యాచ్లను దృష్టిలో ఉంచుకొని టీం మేనేజ్మెంట్ సూర్యకుమార్‌ యాదవ్ కు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. 


వినేశ్ ఫొగాట్, బజ్‌రంగ్ పునియా పొలిటికల్ ఎంట్రీ - ఈ ఒక్క ఫొటోతో కన్‌ఫమ్ అయినట్టేనా?


టెస్ట్ టీములో చోటు కోసం ప్రయత్నం 


సూర్య కుమార్ యాదవ్ టెస్ట్ టీములో చోటు కోసం ప్రయత్నిస్తున్నారు.  ఒక సంవత్సరం పాటు ఫస్ట్ క్లాస్ క్రికెట్కు కూడా దూరంగా ఉన్నాడు. రెడ్ బుల్ క్రికెట్ ప్రాక్టీస్ కోసం కోయంబత్తూర్ లోని బుచ్చిబాబు క్రికెట్ టోర్నమెంట్ కు ఆడేందుకు అందుబాటులోకి వచ్చాడు.  సూర్యకుమార్ యాదవ్ కు ఆ మ్యాచ్లో మూడవరోజు ఫీల్డింగ్ చేస్తూ చేతికి గాయం అయింది. బుచ్చిబాబు క్రికెట్ టోర్నమెంట్ దిలీప్ ట్రోఫీ మ్యాచ్ల అనంతరం రాబోయే 2024 2025 సంవత్సరానికి గాను 10 టెస్ట్ మ్యాచ్ లు టీమిండియా ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌ల కోసం పూర్తి  ఫిట్‌నెస్ సాధించడానికి టీమిండియా స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ రెడ్ బుల్ క్రికెట్ పై ప్రత్యేక దృష్టిని సాధించాడు కానీ కోయంబత్తూర్ లోని బుచ్చిబాబు క్రికెట్ టోర్నమెంట్లో మూడోరోజు ఫీలింగ్ చేస్తున్న సమయంలో చేతికి గాయం కావడంతో దిలీప్ ట్రోఫీలోని మొదటి రౌండ్ కు సూర్య కుమార్ యాదవ్ దూరమయ్యాడు. ప్రస్తుతం సూర్య కుమార్ యాదవ్ బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో మ్యాచులు ఆడేందుకు ఫిట్‌నెస్ సాధించే ప్రయత్నంలో ఉన్నాడు. 


ఓ విండీస్! ఓ శ్రీలంక! ఓ పాకిస్థాన్‌, పతనం దిశగా దాయాది జట్టు


నిరాశలో సూర్య అభిమానులు : 


అనంతపురం క్రికెట్ మైదానంలో జరుగుతున్న దులీప్ ట్రోఫీ లో తమ అభిమాన క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ వస్తాడని తెలుసుకున్న అభిమానులు పెద్ద ఎత్తున మ్యాచ్ చూడడానికి సిద్ధమయ్యారు. ప్రస్తుతం సూర్య కుమార్ చేతికి గాయం కారణంగా మొదటి రౌండును ఆడలేకపోతున్నట్లు ఇప్పటికే క్రికెట్ వర్గాలు వెలువరించడంతో సూర్యకుమార్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఎప్పుడు టీవీలో చూసే సూర్యకుమార్ స్కై షాట్స్  ను ప్రత్యక్షంగా చూడాలని భావించిన అభిమానులకు నిరాశే ఎదురయింది.