Tirumala Srivari Anna Prasadam News:  కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమలలో కొలువైన శ్రీ వేంకటేశ్వర స్వామిని నిత్యం లక్షల మంది భక్తులు దర్శించుకుంటారు. ఈసందర్భంగా శ్రీవారి సన్నిధిలో ఉండే భక్తులకు అడుగడుగునా ప్రసాదాలు పంపిణీ చేస్తుంటారు. ఇక అన్నప్రసాదం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అయితే లేటెస్ట్ గా శ్రీవారి అన్నప్రసాదాల మెనూలో  టీటీడీ మసాలా వడ చేర్చింది.

 

భక్తులకు కొన్నేళ్లుగా అన్నం, కర్రీ, కొబ్బరి చట్నీ, చక్కెర పొంగలి, సాంబారు, రసం, మజ్జిగ ప్రసాదంగా వడ్డిస్తున్నారు. ఇప్పుడు అన్నదానం మెనూలో మార్పులు చేయాలని, కొత్త పదార్థాలు ఏడ్ చేయాలని తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు నిర్ణయించారు.  ఈ మేరకుమెనూలో మరో పదార్థం చేర్చాలని గతేడాది నవంబరులోనే TTD ధర్మకర్తల మండలి తీర్మానించింది. ఇందులో భాగంగా జనవరి 20 మధ్యాహ్నం భోజనం సమయంలో ప్రయోగాత్మకంగా మసాలా వడ వడ్డించారు.

 


 

ప్రయోగాత్మకంగా 5 వేల వడ చేయించారు. ఇందులో ఉల్లి, వెల్లుల్లి లేకుండా తయారు చేసి భక్తులకు వడ్డించారు. మరో నాలుగు రోజుల్లో వడల తయారీ సంఖ్య పెంచనున్నారు.  ట్రయల్ రన్ లో లోటుపాట్లు సరిచేసుకుని రథసప్తమి నాటికి అన్నదాన మెనూలో పూర్తిస్థాయిలో వడలు చేర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మసాలా వడనే కంటిన్యూ చేయాలా లేదంటే ఈ స్థానంలో మరేదేనా వంటకం పెట్టాలా అనే ఆలోచనలోనూ ఉన్నారు టీటీడీ అధికారులు  







Also Read: తిరుమల హుండీలో సొమ్ము 3 భాగాలు - మీరు ఏ భాగంలో వేస్తున్నారు , ఎలాంటి ముడుపులు చెల్లిస్తున్నారు?


తిరుమ‌ల‌ శ్రీవారి దర్శనార్థం దేశ విదేశాల నుంచి వచ్చే లక్షలాది భక్తులకు రుచిగా, శుచిగా అన్నప్రసాదం అందించేందుకు TTD ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టు ఒక రోజు విరాళ పథకం భక్తులకు అందుబాటులో ఉంది . ఒక రోజు పూర్తిగా అన్నప్రసాద వితరణలో భాగంగా 44 లక్షల రూపాయాలు చెల్లించాల్సి ఉంటుంది. ఉదయం అల్పాహారం కోసం 10 లక్షలు, మధ్యాహ్న భోజనం కోసం 17 లక్షలు, రాత్రి భోజనం కోసం 17 లక్షలు అందించిన దాతలు తామే స్వయంగా భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించవచ్చు. అన్నప్రసాదానికి విరాళం అందించేవారి పేరు వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ప్రదర్శిస్తారు.


తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కాంప్లెక్స్, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -1, 2లోని ఉన్న కంపార్ట్‌మెంట్లు, బయటి క్యూలైన్‌లు, పీఏసీ-4 , పీఏసీ-2, తిరుపతిలోని శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యం, శ్రీనివాసం, విష్ణునివాసం కాంప్లెక్సులు, రుయా హాస్పిటల్, స్విమ్స్, మెటర్నిటీ ఆస్పత్రి, బర్డ్, ఎస్వీ ఆయుర్వేద ఆస్పత్రి, తిరుచానూరులోని అన్నప్రసాద భవనంలో భక్తులకు నిత్యం ఉచితంగా అన్నప్రసాద వితరణ జరుగుతుంది.


 తిరుమలలోని ఫుడ్ కౌంటర్లలోనూ అన్నప్రసాదాలు అందిస్తారు. ఇంకా వైకుంఠం క్యూకాంప్లెక్స్-1, 2లోని కంపార్ట్‌మెంట్లు, వృద్ధులు, దివ్యాంగులు వేచి ఉండే కాంప్లెక్స్ లతో పాటూ 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన కాంప్లెక్స్, ప్రధాన కల్యాణకట్టలలో టీ, కాఫీ, చంటిపిల్లలకు పాలు అందించే ఏర్పాట్లున్నాయి.


Also Read: తిరుమల భోజనశాలలో ఉన్న ఈ పెయింటింగ్ ఏంటో తెలుసా!