నవవిధ భక్తి మార్గాలు' గురించి ప్రస్తావన పురాణాల్లో కనిపిస్తుంది. భగవంతుడిని భక్తులు సేవించి తరించడానికి 'శ్రవణం', 'కీర్తనం', 'స్మరణం', 'పాదసేవనం', 'అర్చనం', ' వందనం', 'దాస్యం', 'సఖ్యం', 'ఆత్మనివేదనం' వంటి తొమ్మిది భక్తి మార్గాలు చెప్పారు.  వీటిలో ఏ ఒక్క మార్గాన్ని అనుసరించినా ఆ భక్తుడి జీవితం ధన్యం అవుతుందంటారు పెద్దలు. ఈ తొమ్మిది మార్గాల్లో ఒక్కొక్కరూ ఒక్కొక్క మార్గాన్ని అనుసరించి చరిత్రలో నిలిచిపోయిన భక్తులు ఎందరో ఉన్నారు. 
శ్రవణం
భగవంతుడి గుణగణాలు, నామాలు, కథలు వినడం ద్వారా జ్ఞానాన్ని పెంచుకుని భగవంతుడికి దగ్గర కావడం. ఈ మార్గానికి పరీక్షిత్‌ మహారాజుఉదాహరణ. కథా శ్రవణాన్ని యోగంలా అనుష్ఠించి దాని ద్వారా ముక్తిని పొందాడు.
కీర్తనం
కీర్తనంలో ఉండే గానధర్మం వల్ల మనస్సు సహజంగా భగవంతుడివైపు ఆకర్షితమవుతుంది. భగవత్సంకీర్తనలో ప్రథమాచార్యుడిగా కీర్తి గాంచిన నారదుడు ఇందుకు ఉదాహరణ.
స్మరణం
భగవంతుణ్ని ధ్యానించడమే స్మరణ భక్తి. నిరంతరం నారాయణ నామస్మరణతో తరించి ఎన్నో అడ్డంకులను అవలీలగా ఎదుర్కొన్న  ప్రహ్లాదుడు ఇందుకు గొప్ప ఉదాహరణ.
పాదసేవనం
భగవంతుడి పాదాల్ని, గురువుల పాదాల్ని సేవించడమే పాద సేవన భక్తి. అన్నయ్యే అన్నీ అనే ఉద్దేశంతో లక్ష్మణుడు రాముడికి పాదసేవనం చేసి తరలించాడు
అర్చనం
తులసి, పుష్ప మాలలతో భగవంతుణ్ని పూజించడం అర్చన. దీనికి ఉదాహరణ మథురానగరంలో కంసుడి పరిచారిక అయిన కుబ్జ. రకరకాల సువాసనలతో లేపనాలు తయారుచేయడం ఆమె పని. కృష్ణుడికి ప్రేమతో తన దగ్గరున్న లేపనాలు అందిస్తుందామె. ఆ లేపనాలు పూసుకున్న కృష్ణుడు ఆమె పాదాలపై తనపాదాలు మోపి గడ్డాన్ని స్పృశించగానే కురూపిగా ఉన్న కబ్జ సురూపగా మారిపోతుంది. పృధు చక్రవర్తిని కూడా ఇందుకు ఉదాహరణగా చెబుతారు.
వందనం
భక్తి, శ్రద్ధలతో భగవంతుడికి నమస్కరించడం వందనభక్తి. దీనికి ఉదాహరణ అక్రూరుడు. బలరామకృష్ణుల్ని రథం మీద మథురకు తీసుకెళ్లడానికి వచ్చిన అక్రూరుడు.. బృందావనంలో శ్రీకృష్ణ, బలరాముల్ని సమీపించి వినయంతో వందనం చేసి భగవంతుడి అనుగ్రహానికి పాత్రుడయ్యాడు.
దాస్యం
సర్వకాల సర్వావస్థల్లో భగవంతుడి సేవ చేస్తూ అదే భావనతో జీవించడమే దాస్యం.  శ్రీ కృష్ణుడి చరణ సేవా భాగ్యాన్ని కోరుతూ ‘నీకు దాస్యంబు చేయని జన్మమేలా’ అని రుక్మిణి భక్తిని ప్రదర్శించింది. గరుత్మంతుడు, ఆంజనేయులది కూడా దాస్యభక్తే.
సఖ్యం
భగవంతుణ్ని స్నేహితుడిగా భావించి ఆయన గుణగణాల్ని అలవర్చుకోవడమే సఖ్య భక్తి. దీనికి అర్జునుడు మంచి ఉదాహరణ. సఖ్యం ద్వారా సన్మార్గంలో నడవడమే కాదు విజయం దిశగా అడుగులు వేయొచ్చని నిరూపించాడు అర్జునుడు.
ఆత్మనివేదనం 
మనోవాక్కాయ కర్మలతో భగవంతుడికి తననుతాను అర్పించుకోవడం ఆత్మనివేదన భక్తి. బలి చక్రవర్తి ఇందుకు ఉదాహరణ. వచ్చినదెవరో తెలుసినప్పటికీ ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు తనని తాను అర్పించుకుని ఆత్మనివేదనం చేసుకున్నాడు బలిచక్రవర్తి. 
ఈ తొమ్మిది రకాల భక్తి మార్గాల్లో ఏం అనుసరించినా మోక్షం పొందొచ్చని భక్తుల విశ్వాసం.
Also Read: ఈ దిక్కున తలపెట్టి నిద్రిస్తే ఐశ్వర్యం, ఆ దిక్కున తలపెడితే అకాల మృత్యువు- వాస్తు ఏం చెబుతోంది-సైన్స్ ఏమంటోంది..
Also Read:  రాళ్లు మాట్లాడతాయా… విగ్రహాలకు పూజలెందుకు అనేవారి ఇదే సమాధానమా..!
Also Read: పన్నెండు నెలల్లో కార్తీక మాసం ఎందుకు ప్రత్యేకం .. ఈ నెలలో ఈ పనులు మాత్రం చేయకండి..!
Also Read: దొంగలే పాలకులు.. పాలకులే దొంగలు...కలికాలం అంటే ఇదే
Also Read: జీవిత కాలంలో ఒక్కసారైన దర్శించుకోవాల్సిన శైవ క్షేత్రాలివి
Also Read: అప్సరసలంటే ఎవరు.. మొత్తం ఎంత మంది ఉన్నారో తెలుసా..!
Also Read: 1008 రకాల కూరగాయలు ఉన్నాయా... ఇప్పటి వరకూ తిన్నారా ఎవరైనా...!
Also Read:  సంపాదన పెరగాలన్నా, వచ్చింది నిలవాలన్నా ఇలా చేస్తే మంచిదట...
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి