Pavan On YSRCP :  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మూడేళ్లయిన సందర్భంగా ప్లీనరీ నిర్వహిస్తున్నారు. ఈ ప్లీనరీలో హైలెట్ నవరత్నాలే. అయితే ఈ నవరత్నాలపై పవన్ కల్యాణ్ అనేక సందేహాలు వ్యక్తం  చేస్తూ ట్వీట్ చేశారు. నవ సందేహాలను వ్యక్తం చేశారు. పవన్ కల్యణ్ ప్రత్యేకంగా గ్రాఫిక్ టెంప్లెట్‌ను పోస్ట్ చేశారు. 





వైఎస్ఆర్‌ సీపీ గౌరవాధ్యక్షురాలిగా వైఎస్ విజయమ్మ రాజీనామా, ప్లీనరీలో సంచలన ప్రకటన


“మొదటి రత్నం”: రైతు భరోసా 64 లక్షల మందికి మేలు అని చెప్పి 50 లక్షల మందికే భరోసా ఇవ్వడం నిజం కాదా?.. మూడేళ్లలో మూడు వేల మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటే కేవలం ఏడు వందల మందికి ఆర్థిక సహాయాన్ని పరిమితం చేయలేదా?.త అని ప్రశ్నించారు.  “రెండవ రత్నం”: అమ్మ ఒడి, అమ్మ బడి 43 లక్షల మందికి మాత్రమే ఇచ్చి 83 లక్షల మందికి ఇచ్చామని ఎందుకు అబద్ధపు ప్రచారం చేస్తున్నారు? అని ప్రశ్నించారు. 


 






గజదొంగలంతా ఏకమైనా మనల్ని అధికారంలోకి రాకుండా అడ్డుకోలేరు: వైఎస్ జగన్ ధ్వజం


” మూడవ రత్నం”: పెన్షన్లు, పెన్షనర్ల జాబితాను కుదించి 5 లక్షల మందిని తొలగించిన మాట వాస్తవం కాదా?..”నాలుగవ రత్నం”: సంపూర్ణ మద్యపాన నిషేధం, మద్యపాన ఆదాయం 2018- 19 లో రూ14 వేల కోట్లు.. 2021- 22 లో రూ. 22 వేల కోట్లు ఇదేనా మద్య విధం? ఈ ఆదాయం చూపించే రూ. 8 వేల కోట్ల బాండ్లు అమ్మ లేదా..ఐదవ రత్నం: జలయజ్ఞం, పోలవరం ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన ఎప్పుడు పూర్తి చేస్తారో చెబుతారా?..ఆరవ రత్నం: ఆరోగ్యశ్రీ, ఆరోగ్యశ్రీ పథకం నుంచి ఆసుపత్రులు ఎందుకు పక్కకు తప్పుకుంటున్నాయి? అంటూ ఇలా తొమ్మిది రత్నాలు పై 9 ప్రశ్నలు సంధించారు.


రాహుల్‌ని ప్రధాని చెయ్యాలనేది వైఎస్ కోరిక, అలా జరిగితేనే ఆత్మకు శాంతి: రేవంత్ రెడ్డి


కొన్ని రోజులుగా పవన్ కల్యాణ్‌ ప్రబుత్వ పథకాలపై విమర్శలు చేస్తున్నారు. కార్టూన్ల ద్వారా ప్రభుత్వం ప్రజలను  మోసం చేసిందని వివిధ హామీల గురించి వివరిస్తున్నారు. ప్లీనరీ సందర్భంగా పవన్ చేసిన ట్వీట్ వైరల్ అయింది.