అమరావతి : ఏపీ పీసీసీ అధ్యక్షుడిగా గిడుగు రుద్రరాజు నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ లో భారీ మార్పులు జరిగాయి. కొత్త పీసీసీ చీఫ్‌తో పాటు కొన్ని కమిటీలను సైతం నియమించారు. ఈ మేరకు ఏఐసీసీ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత పీసీసీ చీఫ్ పనితీరుపై అసంతృప్తిగా ఏఐసీసీ శైలజానాథ్ కు షాకిచ్చింది. ఆయనను ఆ పదవి నుంచి తొలగిస్తూ గిడుగు రుద్రరాజును రాష్ట్ర కాంగ్రెస్ బాస్ నియమించారు. 18 మందితో పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీని ఏర్పాటు చేసింది. 33 మందితో కో ఆర్డినేషన్‌ కమిటీని ఏఐసీసీ నియమించింది. 

ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్స్..ఏపీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లుగా మస్తాన్ వలిజంగా గౌతమ్సుంకర పద్మశ్రీరాకేశ్‌ రెడ్డి

ఏఐసీసీ ప్రోగ్రాం ఇంప్లిమెంటేషన్ కమిటీ (కార్యక్రమాల అమలు కమిటీ) ఛైర్మన్ గా మాజీ మంత్రి ఎంఎం పల్లం రాజును నియమించారు. పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌గా మాజీ ఎంపీ హర్షకుమార్‌ నియమితులయ్యారు. మీడియా, సామాజిక మాధ్యమాల కమిటీ చైర్మన్ గా ఎన్ తులసిరెడ్డికి బాధ్యతలు అప్పగించారు.

గిడుగు రుద్రరాజు గతంలో ఎమ్మెల్సీగా సేవలు అందించారు. ఏఐసీసీ కార్యదర్శిగా ఒడిశా సహాయ ఇంఛార్జి బాధ్యతలు నిర్వహించారు. దివంగత నేత, ఉమ్మడి ఏపీ మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డికి, ఆయన మిత్రుడు కేవీపీలకు సన్నిహితుడు రుద్రరాజు. పార్టీని ముందుకు తీసుకెళ్లాలంటే పీసీసీ చీఫ్ మార్పు అవసరమని భావించిన ఏఐసీసీ శైలజానాథ్ ను ఆ బాధ్యతల నుంచి తప్పిస్తూ.. గిడుగు రుద్రరాజుకు బాధ్యతలు అప్పగించింది.  2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కనీసం ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. మరోవైపు ఇటీవల కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన మల్లిఖార్జున ఖర్గే ఏపీలో పార్టీ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తూ రాష్ట్రంలో పీసీపీ కొత్త కార్యవర్గాన్ని నియమించారు.

కో ఆర్డినేషన్ కమిటీ సభ్యులు వీరే..1. ఉమెన్ చాందీ2. సీడీ మెయ్యప్పన్3. క్రిస్టోఫర్ తిలక్4. గిడుగు రుద్రరాజు5. కిరణ్ కుమార్ రెడ్డి6. కేవీపీ రామచంద్రరావు7. రఘువీరారెడ్డి8. డాక్టర్ సాకె శైలజానాథ్9. ఎంఎం పల్లంరాజు10. డాక్టర్ చింతా మోహన్11. టి.సుబ్బరామిరెడ్డి12. జేసుదాసు శీలం13. జీవీ హర్ష కుమార్14. కె బాపిరాజు15. ఎన్ తులసిరెడ్డి16. కె రాజు17. సాయి ప్రతాప్18. మస్తాన్ వలీ19. డాక్టర్ సిరివెల్ల ప్రసాద్20. ఉషా నాయుడు21. జంగా గౌతమ్22. పద్మశ్రీ సుంకర23. రాకేశ్ రెడ్డి24. షాజహాన్ బాషా25. కమలమ్మ26.  ఎన్ వరదరాజులు రెడ్డి27. సుధాకర్28. సత్యవతి29. వినయ్ కుమార్30. కె బి ఆర్ నాయుడు31. ఎం సూర్య నాయక్32. జెట్టి గురునాథరావు33. శ్రీరామ మూర్తి

Also Read: Vishnu Kumar Raju : ఏప్రిల్ నుంచి విశాఖ రాజధానిగా పాలన, సీఎం జగన్ అలా చేస్తే ఎవరూ అడ్డుకోలేరు - బీజేపీ నేత విష్ణు కుమార్ రాజు