✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్
  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • తెలంగాణ
  • Charlapally Terminal: అత్యాధునిక హంగులతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ - ద.మ రైల్వే ఆధునీకరణలో ఓ అరుదైన మైలురాయి

Charlapally Terminal: అత్యాధునిక హంగులతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ - ద.మ రైల్వే ఆధునీకరణలో ఓ అరుదైన మైలురాయి

Ganesh Guptha Updated at: 06 Jan 2025 03:55 PM (IST)
1

హైదరాబాద్ చర్లపల్లి టెర్మినల్‌ను ప్రధాని మోదీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వర్చువల్‌గా ప్రారంభించారు. రూ.430 కోట్లతో అభివృద్ధి చేపట్టగా సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్లపై ఒత్తిడి తగ్గనుంది.

Download ABP Live App and Watch All Latest Videos

View In App
2

అత్యాధునిక మౌలిక సదుపాయాలతో నిర్మితమైన ఈ శాటిలైట్ టెర్మినల్ ద.మ రైల్వే పరిధిలో ఓ అరుదైన మైలురాయి. ఈ టెర్మినల్ రోజుకు సుమారు 50,000 మంది ప్రయాణికులను నిర్వహించే సామర్థ్యాన్ని కలిగి ఉంది.

3

చర్లపల్లి టెర్మినల్‌కు ఉప్పల్ మెట్రో స్టేషన్‌ నుంచి ఫీడర్ బస్సులు అందుబాటులో ఉండగా, TSRTC బస్సులు, టాక్సీలు, ఆటోలు కూడా త్వరలో అందుబాటులోకి రానున్నాయి. పెద్ద సంఖ్యలో ప్రయాణికులు సులభంగా ప్రవేశించేందుకు ప్రవేశ ద్వారాలు ఏర్పాటు చేశారు.

4

ప్రయాణికుల వాహనాల కోసం విస్తరించిన పార్కింగ్ సదుపాయం అందుబాటులో ఉంది. రైళ్ల రాకపోకలపై సమాచారాన్ని అందించేందుకు డిజిటల్ డిస్ ప్లే బోర్డులు ఏర్పాటు చేశారు.

5

రూ.430 కోట్లతో అత్యాధునిక హంగులతో దీన్ని అభివృద్ధి చేశారు. ఈ నెల 7 నుంచి గుంటూరు - సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్ - సిర్పూర్ కాగజ్‌నగర్ ఇంటర్‌సిటీ రైళ్లకు అదనపు స్టాపేజ్లు చర్లపల్లి టెర్మినల్‌లో కల్పించబడ్డాయి.

6

ఈ టెర్మినల్‌లో ప్రయాణికులకు సకల సౌకర్యాలు అందుబాటులో ఉంచారు. ప్రతి ప్లాట్‌ఫారమ్‌కు సులభంగా చేరుకునేందుకు ఎస్కలేటర్లు, లిఫ్టులు అందుబాటులో ఉన్నాయి.

7

ప్రయాణీకులు సౌకర్యవంతంగా ప్రత్యేక ఏసీ లాంజ్‌లు ఏర్పాటు చేశారు. టికెట్లు వేగంగా, సులభంగా పొందేందుకు ఆధునిక డిజిటల్ టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేశారు.

8

సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్‌గా పాల్గొనగా.. కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి, బీజేపీ నేత ఈటల రాజేందర్ ఇతర ముఖ్య నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

9

రైల్వే రంగంలో మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యం ఇస్తున్నామని ప్రధాని మోదీ తెలిపారు. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు కనెక్టివిటీ పెంచేలా కృషి చేస్తున్నామన్నారు.

NEXT PREV

- - - - - - - - - Advertisement - - - - - - - - -

About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.