✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్
  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • నల్గొండ
  • Komatireddy Venkat Reddy: ఇండిపెండెన్స్ డే వేడుకల్లో ₹349 కోట్ల రుణాలు, మెప్మా చెక్కులు అందజేసిన మంత్రి కోమటిరెడ్డి

Komatireddy Venkat Reddy: ఇండిపెండెన్స్ డే వేడుకల్లో ₹349 కోట్ల రుణాలు, మెప్మా చెక్కులు అందజేసిన మంత్రి కోమటిరెడ్డి

Shankar Dukanam Updated at: 15 Aug 2025 04:10 PM (IST)
1

నల్గొండ: రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 79వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. అనంతరం జిల్లా అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలను తన సందేశం ద్వారా ప్రజలకు వివరించారు.

Download ABP Live App and Watch All Latest Videos

View In App
2

ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్వాతంత్ర సమరయోధులను సన్మానించారు. ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకు ప్రశంస పత్రాలను అందజేశారు. ద్వారా స్త్రీ నిధి కింద ₹349 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలను మహిళా సంఘాలకు అందజేశారు. ఇందిరమ్మ గృహ లబ్ధిదారులకు ₹3.80 కోట్ల రుణాల చెక్కులను పంపిణీ చేశారు.

3

పరిశ్రమల శాఖ కింద టీ ప్రైడ్ ద్వారా నలుగురికి ₹1.48 కోట్ల చెక్కులు, మెప్మా కింద ₹12.98 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలను అందజేశారు. అలాగే శకటాల ప్రదర్శనను నిర్వహించారు.

4

ఇండిపెండెన్స్ డే సందర్భంగా వివిధ శాఖల అభివృద్ధిని ప్రతిబింబించేలా 12 స్టాల్స్ ఏర్పాటు చేశారు. పలు పాఠశాలల విద్యార్థులు అందించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను ఆకట్టుకున్నాయి.

5

ఇండిపెండెన్స్ డే వేడుకల్లో పాల్గొని పాడుతున్న విద్యార్థులు

6

కార్యక్రమంలో నల్గొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్సీలు నెల్లికంటి సత్యం, శంకర్ నాయక్, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్మారెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు ఎం.ఏ. ఆఫీజ్ ఖాన్, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్, అదనపు ఎస్పీ రమేష్, ఏసీపీ మౌనిక, జిల్లా సీనియర్ అధికారులు, మాజీ ప్రజాప్రతినిధులు ఇతరులు పాల్గొన్నారు.

NEXT PREV

- - - - - - - - - Advertisement - - - - - - - - -

About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.