Rajiv Gandhi Birth Anniversary: గాంధీ భవన్లో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు.. రక్తదాన శిబిరం ఏర్పాటు
హైదరాబాద్లోని గాంధీ భవన్లో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకాంగ్రెస్ నేతలంతా నేతలు రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూల మాల వేసి నివాళి అర్పించారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణికం ఠాకూర్, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ప్రచార కమిటీ అధ్యక్షుడు మధుయాస్కి గౌడ్ హాజరయ్యారు.
హైదరాబాద్లోని సోమాజిగూడ సర్కిల్లో ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి మాణిక్కం ఠాకూర్ పూల మాల వేసి నివాళులు అర్పించారు.
శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క, సీనియర్ నాయకుడు వీహెచ్, మల్లు రవి, అజహరుద్దీన్ సహా ఇతర కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అనంతరం రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఇందిరా భవన్లో రక్త దాన శిబిరాన్ని ప్రారంభించారు.
కాంగ్రెస్ కార్యకర్తలు పలువురు చొరవ తీసుకొని ముందుకొచ్చి రక్తదానం చేశారు.