చాంద్రాయనగుట్ట ఫ్లైఓవర్ ప్రారంభం

చాంద్రాయణ్ గుట్ట ఫ్లైఓవర్ ప్రారంభం
హైదరాబాద్లోని చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్ ప్రారంభిస్తున్న హోంమినిస్టర్ మహమ్ముద్ అలీ
కార్యక్రమంలో పాల్గొన్న టీఆర్ఎస్, ఎంఐఎం నేతలు
674 మీటర్ల పొడువు ఉన్న ఈ ఫ్లైఓవర్ ను రూ.45.90 కోట్ల వ్యయంతో నిర్మించారు.
ప్పటి వరకు భాగ్య నగరంలో మొత్తం 15 ఫ్లైఓవర్లు పూర్తయ్యాయి.
చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్ కార్యక్రమంలో పాల్గొన్న అసదుద్దీన్, అక్బరుద్దీన్
ఎస్ఆర్డీపీ ద్వారా నగరంలో నలువైపులా జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో చేపట్టిన 41 పనుల్లో దాదాపు 30 పనులు పూర్తయ్యాయి.
హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకే ఫ్లైఓవర్ల నిర్మాణం, ఫ్లై ఓవర్ల విస్తరణ, అండర్ పాసులు, ఆర్ఓబీలు చేపట్టింది ప్రభుత్వం
ఎస్ఆర్డీపీలో భాగంగా రూ.8052.92 కోట్లతో మొత్తం 41 పనులు చేపట్టారు. ఇప్పటికే రూ.3748.85 కోట్ల విలువైన 30 పనులు పూర్తయ్యాయి.
15 ఫ్లైఓవర్లు, నాలుగు అండర్ పాసులు, మరిన్ని ఆర్ఓబీలు, ఆర్ యూబీలు ఉన్నాయి
చౌరస్తాల వద్ద సిగ్నల్ చిక్కులు లేకుండా వాహనాల రాకపోకలు సాఫీగా సాగడమే ఎస్ఆర్డీపీ ప్రధాన ఉద్దేశం
చాంద్రాయణ్ గుట్ట ఫ్లైఓవర్ వల్ల ఎల్బీనగర్, ఒవైసీ ఆస్పత్రి, సైదాబాద్, మలక్ పేట్, నల్గొండ ఎక్స్ రోడ్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే వాహనాలు ఇక సిగ్నల్ వద్ద ఆగకుండానే సాగిపోయే అవకాశం ఉంటుంది.
. జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ చాంద్రాయణ గుట్ట తొలి దశ పనులకు 2018లో అనుమతిని ఇచ్చింది. ఒక ఏడాదిలోనే నిర్మాణం కూడా పూర్తయింది
ఆరాంఘర్ నుంచి ఎల్బీనగర్ మీదు ఉప్పల్ వరకు మొత్తం 7 ఫ్లైఓవర్లు, అండర్ పాసుల నిర్మాణాన్ని చేపట్టారు.
ఆరాంఘర్ నుంచి మీర్ ఆలం ట్యాంకు వరకు నిర్మించే ఫ్లైఓవర్ జీహెచ్ఎంసీలోని అతి పొడవైన ఫ్లైఓవర్.