InPics: క్లీవ్లాండ్ డబ్ల్యూటీఏ టెన్నిస్ టోర్నీ రన్నరప్ సానియా మీర్జా జోడీ
క్లీవ్లాండ్ డబ్ల్యూటీఏ టెన్నిస్ టోర్నీలో భారత్, అమెరికా జోడీ సానియా మీర్జా- క్రిస్టీనా మెక్హేల్ రన్నరప్గా నిలిచింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమహిళల డబుల్స్ ఫైనల్లో సానియా- మెక్హేల్ 5-7, 3-6తో షుకో అయోమ- ఎనా షిబహరా (జపాన్) చేతిలో పరాజయం చవిచూశారు.
గంటా 24 నిమిషాల పాటు సాగిన పోరులో జపాన్ జోడీ అన్ని రంగాల్లో పైచేయి సాధించింది.
ఈ ప్రదర్శనతో సానియాకు 180 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
సానియా మీర్జా తదుపరి టోర్నీ కోసం న్యూయార్క్ వెళ్లనుంది.
సోమవారం నుంచి US Open ప్రారంభంకానుంది. ఈ టోర్నీలో పాల్గొనేందుకు సానియా న్యూయార్క్ వెళ్లనుంది.
సానియా మీర్జాకి US Openలో మహిళల డబుల్స్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ప్రవేశం లభించింది.
US Openలో సెప్టెంబరు 1న సానియా తొలి మ్యాచ్ ఆడనుంది.
అమెరికా ప్లేయర్ కోకోతో జతకట్టింది.