New Parliament Building: నూతన పార్లమెంట్ భవనాన్ని ఆకస్మికంగా పరిశీలించిన ప్రధాని మోదీ

ప్రధాని మోదీ తన ఆకస్మిక తనిఖీ సందర్భంగా కార్మికులతో కలిసి ముచ్చటించారు. నిర్మాణ పనులలో వారి సహకారాన్ని ప్రశంసించారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
కొత్త పార్లమెంట్ భవనంలో ప్రధాని మోదీ గంటకు పైగా గడిపారు.

2020 డిసెంబర్లో ఆధునిక సౌకర్యాలతో కూడిన కొత్త పార్లమెంటు భవనానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు.
గతేడాది నవంబర్ నాటికి కొత్త భవనం పూర్తి కావాల్సి ఉండగా.. పూర్తికాలేదు. త్వరలో ప్రారంభోత్సవం జరిగే అవకాశం ఉంది.
కొత్త పార్లమెంట్ హౌస్లో రాజ్యాంగ హాలు, పార్లమెంటు సభ్యుల కోసం లాంజ్, లైబ్రరీ, అనేక కమిటీ గదులు, భోజన ప్రాంతాలు, విశాలమైన పార్కింగ్ స్థలం కూడా ఉంటాయి.
కొత్త పార్లమెంట్ హౌస్ ఉభయ సభల్లో ఏర్పాటు చేసిన ఆధునిక సౌకర్యాలను కూడా ప్రధాని మోదీ పరిశీలించారు.
టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ 2020లో రూ. 971 కోట్లతో ఈ కాంట్రాక్టును సొంతం చేసుకొని భవనాన్ని నిర్మిస్తోంది. దీంతో ప్రాజెక్టు వ్యయం పెరిగిందని అభిప్రాయపడ్డారు.