Rajendra Prasad Granddaughter: రాజేంద్ర ప్రసాద్ మనవరాలు నటించిన లేటెస్ట్ సినిమా... రిలీజ్ ఎప్పుడంటే?
నటకిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కుటుంబం విషాదంలో ఉంది. కుమార్తె గాయత్రి మరణం ఆయనతో పాటు కుటుంబ సభ్యులను ఎంతగానో కలసివేసింది. ఈ తరుణంలో ఆ కుటుంబానికి, రాజేంద్రప్రసాద్ అభిమానులకు ఇదొక చిన్న ఊరట. నటకిరీటి మనవరాలు సాయి తేజస్విని ఓ పాత్రలో నటించిన తాజా సినిమా 'ఎర్రచీర' విడుదలకు సిద్ధమైంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appసుమన్ బాబు ఓ ప్రధాన పాత్రలో నటించడంతో పాటు స్వీయ దర్శకత్వం వహించిన సినిమా 'ఎర్రచీర'. కారుణ్య చౌదరితో శ్రీరామ్, కమల్ కామరాజు, అయ్యప్ప శర్మ, సురేష్ కొండేటి, రఘుబాబు ఇతర తారాగణం. శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్, శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి. డిసెంబర్ 20న ఈ సినిమాను తెలుగు, కన్నడ భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని చెప్పారు.
'ఎర్రచీర' గురించి దర్శక నటుడు సుమన్ బాబు మాట్లాడుతూ... ''సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్, గ్రాఫిక్స్ పూర్తి అయ్యాయి. రాజేంద్ర ప్రసాద్ గారి మనవరాలు 'బేబీ' సాయి తేజస్విని పాత్ర, ఆమె నటన సినిమాకు ప్రధాన ఆకర్షణ. సినిమాలో సుమారు 45 నిమషాల పాటు గ్రాఫిక్స్ ఉంటాయి. ఆ పార్ట్ అద్భుతంగా వచ్చింది'' అని చెప్పారు.
'ఎర్రచీర' నిర్మాత ఎన్.వి.వి. సుబ్బారెడ్డి మాట్లాడుతూ... ''మా సినిమాలో మదర్ సెంటిమెంట్, హర్రర్, యాక్షన్... అన్ని అంశాలు మేళవించి సుమన్ బాబు సినిమా తీశారు. ఇందులో 'బేబీ' సాయి తేజస్విని నటన సరికొత్తగా ఉంటుంది. పతాక సన్నివేశాల్లో మదర్ సెంటిమెంట్ ప్రేక్షకులు అందరినీ కన్నీరు పెట్టిస్తుంది'' అని చెప్పారు.
'ఎర్రచీర' చిత్రానికి ఎస్ చిన్న నేపథ్య సంగీతం అందించగా... పులిగార్ల స్వరాలు సమకూర్చారు. ఈ చిత్రానికి కథ - కథనం - దర్శకత్వం: సుమన్ బాబు, నిర్మాతలు: ఎన్.వి.వి. సుబ్బారెడ్డి, సీహెచ్ వెంకట సుమన్,