Kandula Durgesh - Chiranjeevi: విశ్వంభర సెట్స్లో కందుల దుర్గేష్ - ఏపీ మంత్రిగా బాధ్యతలు తీసుకోవడానికి ముందు...
'విశ్వంభర' సెట్స్లో రాజకీయ సందడి నెలకొంది. ఏపీ ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున నిడదవోలు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కందుల దుర్గేష్ విజయం సాధించారు. ఇప్పుడు ఆయన చిరంజీవిని కలిశారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App''ఆంధ్రప్రదేశ్ పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్న సందర్భంగా 'విశ్వంభర' సెట్స్పై మిత్రుడు శ్రీ కందుల దుర్గేష్ కు స్వాగతం పలకడం ఎంతో ఆనందంగా ఉంది'' అంటూ సోషల్ మీడియాలో చిరంజీవి పేర్కొన్నారు. 'విశ్వంభర' సెట్స్కు దుర్గేష్ వచ్చిన వీడియో, ఫోటోలను ఆయన షేర్ చేశారు.
''ఏపీ మంత్రిగా కందుల దుర్గేష్ తన బాధ్యతలు నిర్వర్తించడంలో సంపూర్ణ విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఆయనకు నా శుభాకాంక్షలు'' అని చిరంజీవి తెలిపారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమ (టాలీవుడ్) అభివృద్ధికి, ప్రస్తుతం చిత్రసీమ ఎదుర్కొంటున్న సవాళ్లను సత్వరం పరిష్కరించేందుకు చొరవ తీసుకుంటానని కందుల దుర్గేష్ చెప్పారని చిరంజీవి వివరించారు. ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రిగా కందుల సురేష్ చూపిన సానుకూలతకు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు చిరంజీవి.
గతంలో చిరంజీవి కేంద్ర మంత్రిగా చేసిన అనుభవం ఉంది. ఇప్పుడు ఏపీ పర్యాటక మంత్రిగా ఆ రంగంలో అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగి వున్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని పర్యాటక స్థలాలను పూర్తిగా కందుల సురేష్ అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్నట్లు, విశ్వసిస్తున్నట్లు చిరంజీవి తెలిపారు.