In Pics: కూలింగ్ గ్లాసెస్ ధరించిన సీఎం జగన్, అరుపులతో దద్దరిల్లిన హాల్
నేడు (ఆగస్టు 26) విశాఖపట్నంలో ప్రపంచలోనే అతిపెద్ద బీచ్ క్లీనింగ్ కార్యక్రమం జరిగింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈ కార్యక్రమం అనంతరం బీచ్ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ హాల్లో ఓ కార్యక్రమం నిర్వహించారు.
ఈ వేదికపై సీఎం జగన్ మాట్లాడుతూ.. నేడు ఒక్కరోజే ఉదయం 6 నుంచి 8 వరకూ 76 టన్నుల ప్లాస్టిక్ను సముద్రం నుంచి తొలగించారని సీఎం జగన్ అన్నారు.
ఏపీలో ప్లాసిక్ ఫ్లెక్సీలను పూర్తిగా నిషేధిస్తున్నట్లుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పారు.
ఇకపై రాష్ట్రంలో ఫ్లెక్సీలు పెట్టాలంటే ప్లాస్టిక్ ఫ్లెక్సీలు పెట్టకూడదని, కాస్త రేటు ఎక్కువైనా గుడ్డతో తయారుచేసినవే పెట్టాలని సీఎం జగన్ పిలుపునిచ్చారు.
ప్లాస్టిక్ ను రీసైక్లింగ్ చేసి తయారు చేసిన షూస్, కళ్ల జోడులను సీఎం స్వయంగా చూపించారు.
పార్లే ఫర్ ది ఓషన్ సంస్థ ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్ చేసి, వ్యాలెట్లు, కళ్లజోళ్లు, బూట్లు వంటి ఉత్పత్తులు తయారు చేస్తోంది.
ఆ ఉత్పత్తులను సీఎం జగన్ పరిశీలించారు.
ఆ సంస్థ ప్రతినిధులతో రీసైక్లింగ్ చేసిన కళ్లజోళ్లు ధరించారు.
ఇతర రీసైక్లింగ్ ఉత్పత్తులను కూడా సీఎం జగన్ పరిశీలించారు.
ఆంధ్రప్రదేశ్ పౌరులుగా సముద్ర తీరాన్ని కాపాడుకునే బాధ్యత మనందరిదని జగన్ అన్నారు.
ఈ సందర్భంగా సముద్రతీర స్వచ్ఛత, ప్టాస్టిక్ రహిత నదీ జలాల అంశంపై పార్లే ఫర్ ది ఓషన్ సంస్థతో ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంది.
సీఎం జగన్ సమక్షంలో పార్లే ఫర్ ది ఓషన్ సంస్థతో ఈ ఎంవోయూ కుదిరింది.