NDA Alliance Meeting: జనసేనాని ఆత్మీయ ఆలింగనం, భావోద్వేగం, అరుదైన ఘట్టం - ఎన్డీయే కూటమి సమావేశంలో జ్ఞాపకాల చిత్రాలు
ఎన్డీయే కూటమి సమావేశానికి హాజరైన టీడీపీ అధినేత చంద్రబాబు. సమావేశానికి ముందు ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళి అర్పించారు
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఎన్డీయే కూటమి సమావేశానికి జనసేనాని పవన్ కల్యాణ్ హాజరయ్యారు. ఆయన ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళి అర్పించారు.
ఎన్డీయే కూటమి సమావేశానికి హాజరైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరిని చంద్రబాబు ఆప్యాయంగా పలకరించారు. ఆమె ఎన్డీయే శాసనసభాపక్ష నేతగా చంద్రబాబును బలపర్చారు.
ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష నేతగా చంద్రబాబును బలపరిచిన అనంతరం జనసేనాని పవన్ కల్యాణ్.. సీఎం అభ్యర్థిగా చంద్రబాబును బలపర్చారు. అనంతరం ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు.
'చంద్రబాబు గారూ మీరే సీఎం'.. అంటూ చంద్రబాబును పవన్ కల్యాణ్ బలపర్చారు. ఈ సందర్భంగా వైసీపీ హయాంలో చంద్రబాబు పడ్డ ఇబ్బందులను పవన్ గుర్తు చేసుకున్నారు.
ఎన్డీయే కూటమి సమావేశానికి హాజరైన ఎమ్మెల్యేలు. వీరంతా శాసనసభాపక్ష నేతగా, సీఎం అభ్యర్థిగా చంద్రబాబును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఎన్డీయే కూటమి సమావేశానికి హాజరైన ఎమ్మెల్యేలు. వీరంతా శాసనసభాపక్ష నేతగా, సీఎం అభ్యర్థిగా చంద్రబాబును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఎన్డీయే కూటమి సమావేశానికి హాజరైన మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేశ్, ఇతర ఎమ్మెల్యేలు. వీరంతా శాసనసభాపక్ష నేతగా, సీఎం అభ్యర్థిగా చంద్రబాబును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన అనంతరం కూటమి నేతలకు చంద్రబాబు అభివాదం చేశారు. వారికి ధన్యవాదాలు తెలియజేశారు.
కూటమి శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన అనంతరం చంద్రబాబు ప్రసంగం. అధికారం అనేది పెత్తనం కోసం కాదని.. ప్రజలకు సేవ చేసేందుకేనని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలు చారిత్రాత్మక విజయం అందించారని అన్నారు.