Tirumala: తిరుమలలో వైభవంగా కార్తీక పౌర్ణమి గరుడ సేవ - మాడ వీధుల్లో భక్తులను అనుగ్రహించిన శ్రీనివాసుడు

తిరుమలలో కార్తీక పౌర్ణమి గరుడ సేవ శుక్రవారం రాత్రి వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో ఈ వేడుకలో పాల్గొన్నారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
శుక్రవారం రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడడైన శ్రీనివాసుడు ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు.

పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్య దేశాల్లోనూ గరుడ సేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. భక్తుల గోవింద నామస్మరణతో తిరుమల మాడ వీధులు మార్మోగాయి.
ఈ కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు ఈవో వెంకయ్యచౌదరి, తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు పాల్గొన్నారు.
జ్ఞాన వైరాగ్య ప్రాప్తి కోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వ పాపాలు తొలగుతాయని భక్తుల విశ్వాసం.
గరుడ వాహనం ద్వారా స్వామి వారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజేస్తారు. అందుకే గరుడ సేవ అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉంది.