Pawan Kalyan: ఆలయాల సందర్శన ప్రారంభించిన పవన్ కళ్యాణ్, వెంట కుమారుడు అకీరా నందన్ Photos చూశారా

ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దక్షిణాది ఆధ్యాత్మిక యాత్ర బుధవారం ఉదయం ప్రారంభించారు. ఇదివరకే ఈ విషయాన్ని ప్రకటించారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని పలు పుణ్య క్షేత్రాలు దర్శించుకునే యాత్రకి పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా కేరళలోని కొచ్చి విమానాశ్రయానికి బుధవారం ఉదయం చేరుకున్నారు.

కొచ్చి సమీపంలోని శ్రీ అగస్త్య మహర్షి ఆలయాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. అక్కడ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి, అనంతరం అర్చకుల నుంచి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక సనాతన ధర్మం, హిందుత్వంపై ఫోకస్ చేసి రాజకీయాలు చేస్తున్నారు. తమిళ డిప్యూటీ సీఎం స్టాలిన్ తో సనాతన పోరు మొదలైంది.
దక్షిణాది ఆలయాల ఆధ్యాత్మిక యాత్ర చేపట్టిన పవన్ కళ్యాణ్ వెంట ఆయన తనయుడు అకీరా నందన్ ఉన్నాడు. దాంతో ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
రాజకీయాలకు పిల్లల్ని దూరంగా ఉంచాలని పదే పదే చెప్పే పవన్ కళ్యాణ్.. సనాతన పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శలు ఎలాగూ ఉన్నాయి. దీనికి తోడు ఆలయాల సందర్శనలో తన వెంట అకీరాను తీసుకెళ్లడం హాట్ టాపిక్ అవుతోంది.
గతంలో తన ఇద్దరు కూతుళ్లతో కలిసి ఆలయానికి వెళ్లిన పవన్ కళ్యాణ్ తాజాగా కేరళ, తమిళనాడు ఆలయాల పర్యటనకు కుమారుడు అకీరా నందన్ ను వెంట తీసుకెళ్లారు.