Nirav Modi brother  Nehal Modi arrested in US: పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి వేల కోట్లు అప్పులు తీసుకుని పరార్ అయిన  నిరవ్ మోదీ గ్యాంగ్‌‌లో కీలక వ్యక్తి నెహాల్ మోదీని అమెరికాలో అరెస్టు చేశారు. ఈయన నిరవ్ మోదీ సోదరుడు.  పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB)లో జరిగిన రూ. 13,000 కోట్ల మోసం కేసులో భారత్ నుండి పరారీలో ఉన్నారు వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ . ఆ సోదరుడు నేహల్ మోదీని అమెరికాలో అరెస్టు చే చేశారు.  భారతదేశ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ,  సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI)  నేరస్తుల అప్పగింత ఒప్పందంలో  భాగంగా చేసిన  అభ్యర్థనల ఆధారంగా  పట్టుకున్నారు. 


నేహల్ మోదీ  నీరవ్ మోదీ   చిన్న సోదరుడు.  భారతదేశ బ్యాంకింగ్ చరిత్రలో అతిపెద్ద మోసాలలో  ఒకటి నిరవ్ మోదీ సోదరులు, మోహుల్  చోక్సీ చేసిన మోసం.   నీరవ్ మోదీ   ప్రస్తుతం లండన్ జైలులో ఉన్నాడు. భారత్ కు పంపవద్దని  న్యాయపోరాటం చేస్తున్నాడు. బ్యాంకుల నుంచి అప్పుల రూపంలో కొల్లగొట్టిన నగదును నేహల్ మోదీ  లాండరింగ్ చేయడంలో కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అతను షెల్ కంపెనీలు, ఆఫ్‌షోర్ లావాదేవీల ద్వారా అక్రమ నిధులను రూట్ చేశాడని దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి.


ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో నేహల్ మోదీ పేరు ఉంది.  అతను సాక్ష్యాధారాలను నాశనం చేసే ప్రయత్నం  చేశాడని,  నీరవ్ మోదీ  అక్రమాలకు  పూర్తిగా తెలిసి సాయం చేసినట్లుగా  ఈడీ చెబుతోంది.  PNB మోసం బయటపడిన తర్వాత, నేహల్ మోదీ  నీరవ్  సన్నిహిత సహాయకుడు మిహిర్ ఆర్. భన్సాలీ దుబాయ్ నుండి 50 కిలోల బంగారం, గణనీయమైన నగదును తీసుకున్నారని  ED గుర్తించింది.  నేహల్ మోదీ బెల్జియంలోని ఆంట్వెర్ప్‌లో జన్మించాడు. అక్కడే పెరిగాడు.  బెల్జియన్ పౌరసత్వం ఉంది.  కొన్ని సంవత్సరాల క్రితం అతని పేరిట ఇంటర్‌పోల్ రెడ్ నోటీసు జారీ చేశారు. 


2015లో, నేహల్ మోదీ LLD నుండి  2.6 మిలియన్ డాలర్ల  విలువైన వజ్రాలను  సులభమైన క్రెడిట్ షరతులపై పొంది, వాటిని వ్యక్తిగత లాభాల కోసం విక్రయించాడని ఆరోపణలు ఉన్నాయి నేహల్ మోదీపై ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA), 2002  సెక్షన్ 3 కింద ఒక డబ్బు లాండరింగ్, ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 120-B , 201 కింద క్రిమినల్ కుట్ర ఆరోపణల కేసులు ఉన్నాయి.  నీరవ్ మోదీ యొక్క క్రిమినల్ నెట్‌వర్క్‌లో కీలక పాత్ర పోషించాడని, ఆస్తులను దాచడంలో ,సాక్ష్యాధారాలను నాశనం చేయడంలో సహాయపడ్డాడని అధికారులు ఆరోపిస్తున్నారు.  





 
 PNB మోసం ది భారత బ్యాంకింగ్ వ్యవస్థపై గణనీయమైన ప్రభావం చూపింది. నేహల్ మోదీ  ఎక్స్‌ట్రాడిషన్ ప్రక్రియలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. అక్కడి కోర్టులు అంగీకరిస్తే ఇండియాకు తీసుకు వచ్చి ప్రశ్నించే అవకాశం ఉంది.