Bengal Cabinet Reshuffle: పార్థ ఎఫెక్ట్- బంగాల్ కేబినెట్‌లో కొత్త ముఖాలు- దీదీ కీలక ప్రకటన

ABP Desam   |  Murali Krishna   |  01 Aug 2022 02:49 PM (IST)

Bengal Cabinet Reshuffle: కేబినెట్‌లో మార్పులు చేస్తున్నట్లు బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు.

(Image Source: PTI)

Bengal Cabinet Reshuffle: బంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్థ చటర్జీ అరెస్ట్‌తో కేబినెట్‌ మొత్తాన్ని మారుస్తారనే వార్తలను ఆమె ఖండించారు. అయితే నలుగురు లేదా ఐదుగురు కొత్త వాళ్లను కేబినెట్‌లోకి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. 

చాలా మంది ఏదేదో రాస్తున్నారు. అయితే మొత్తం కేబినెట్‌లో మార్పు చేసే ఆలోచన మాకు లేదు. అయితే కేబినెట్‌లో మార్పులు ఉంటాయి. మంత్రులు సుబ్రతా ముఖర్జీ, సదన్ పాండేలను మేం కోల్పోయాం. పార్థ చటర్జీ జైలులో ఉన్నారు. ఆయనకు సంబంధించిన పనులు పెండింగ్‌లో ఉన్నాయి. నేను ఒక్కదాన్నే అన్నీ చూసుకోలేను. అందుకే బుధవారం కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణ చేపడతాం. నలుగురు నుంచి ఐదుగురు కొత్త వ్యక్తులను కేబినెట్‌లోకి తీసుకుంటాం.                                                 - మమతా బెనర్జీ, బంగాల్ ముఖ్యమంత్రి

బంగాల్ టీచర్ రిక్రూట్‌మెంట్ కుంభకోణం కేసులో మాజీ మంత్రి పార్థ చటర్జీని ఈడీ ఇటీవలే అరెస్టు చేసింది. ఆయన సన్నిహితురాలు నటి అర్పిత ముఖర్జీ నివాసాల్లో సోదాలు నిర్వహించిన అధికారులు రూ.50 కోట్ల నగదు, బంగారు ఆభరణాలను జప్తు చేశారు.

ఈ పరిణామాల అనంతరం పార్థ చటర్జీని మంత్రి పదవిని తొలగించారు దీదీ. అంతేకాకుండా పార్టీలోని అన్ని పదవుల నుంచి తప్పించారు.

Also Read: TN Governor RN Ravi: గన్ వాడేవాళ్లకు గన్‌తోనే ఆన్సర్- గవర్నర్ సంచలన వ్యాఖ్యలు

Also Read: Salman Khan: సల్మాన్ ఖాన్‌కు తుపాకీ లైసెన్స్- భద్రత పెంచిన ముంబయి పోలీసులు

Published at: 01 Aug 2022 02:44 PM (IST)
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.