Viral Video:


గుజరాత్‌లో..


గుజరాత్‌కు చెందిన ఓ గాయకుడిపై నోట్ల వర్షం కురిపించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఫోక్ సింగర్ కీర్తిదన్ గధ్వీ  భజన సమయంలో పాడిన పాట విని ముగ్ధులైన భక్తులు ఒక్కసారిగా నోట్ల వర్షం కురిపించారు. గుజరాత్‌లోని వల్సద్‌లో జరిగిందీ ఘటన. వల్సద్ అగ్నివీర్ గో సేవా దళ్ ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పాటలు పాడాడు. చుట్టూ ఉన్న వాళ్లు ఒక్కసారి రూ.10, 20,50,100 నోట్లు ఆయనపై వెదజల్లారు. ప్రముఖ వార్తా సంస్థ ANI ఈ వీడియోని ట్విటర్‌లో పోస్ట్ చేసింది. పోడియంపైన కూర్చుని హార్మోనియం వాయిస్తూ కీర్తిదన్ పాట పాడుతున్నాడు. అప్పటి వరకూ కూర్చున్న ప్రేక్షకులంతా ఒక్కసారిగా ముందుకు వచ్చి నోట్లు చల్లడం మొదలు పెట్టారు. మొత్తం వేదిక అంతా కరెన్సీ నోట్లతో నిండిపోయింది. నిజానికి గుజరాత్‌లో ఇదో ట్రెండ్‌ అయిపోయింది. ఫోక్‌ సింగర్స్ ఎవరు ఎక్కడ ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇచ్చినా వాళ్లపై ఇలా నోట్ల వర్షం కురిపిస్తారు. అంతే కాదు. ఇలా వచ్చిన డబ్బుని సామాజిక సేవకే వినియోగిస్తారట. అయితే...అనారోగ్యానికి గురైన ఆవులకు చికిత్స అందించడానికి, వాటి బాగోగులు చూడటానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆ స్టేజ్‌పై కురిపించిన డబ్బునంతా ఆ ఆవుల ఆరోగ్యం కోసమే ఖర్చు చేస్తారట. అంతకు ముందు నవసరి గ్రామంలోనూ కీర్తిదన్‌ కచేరీ పెట్టగా అప్పుడు ఏకంగా రూ.50 లక్షల నోట్ల  వర్షం ఆయనపై కురిపించారు ఆడియన్స్.