సుప్రీంకోర్టులో జడ్జీల నియామకాలకు సంబంధించిన కొలీజియం సమావేశంపై మీడియాలో ఊహాజనిత కథనాలు రావడం దురదృష్టకరం. న్యాయమూర్తుల నియమాక ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. ఇది చాలా పవిత్రమైన ప్రక్రియ. ఎంతో గౌరవంతో కూడుకున్నది. దీన్ని మీడియా మిత్రులు గుర్తించాలి. అర్థం చేసుకోవాలి. ఈ ప్రక్రియ పూర్తికాకముందే కథనాలు రాయడం ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఇలాంటి బాధ్యతారహితమైన రిపోర్టింగ్‌, ఊహాగానాల వల్ల కొందరి కెరీర్లు దెబ్బతింటాయి. ఈ పరిణామాలపై నేను తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నా.- జస్టిస్ ఎన్వీ రమణ, భారత ప్రధాన న్యాయమూర్తి