Purvanchal Expressway Inauguration: 'వాళ్లు యూపీకి అన్యాయం చేశారు.. అందుకే శాశ్వతంగా దూరమైపోయారు'

ABP Desam Updated at: 16 Nov 2021 04:01 PM (IST)
Edited By: Murali Krishna

పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌ వేను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. తమ పాలన వచ్చిన తర్వాత రాష్ట్రాభివృద్ధిలో కొత్త శకం మొదలైందన్నారు.

పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ వేను ప్రారంభించిన మోదీ

NEXT PREV

ఉత్తర్‌ప్రదేశ్ సుల్తాన్​పుర్​ జిల్లాలో పూర్వాంచల్​ ఎక్స్​ప్రెస్​ వేను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. రూ.22,500 కోట్ల వ్యయంతో ఈ రహదారిని పూర్తి చేశారు. లఖ్​నవూను యూపీలోని తూర్పున ఉండే ప్రాంతాలను కలుపుతూ 340.8 కిలోమీటర్ల మేర ఈ రహదారిని నిర్మించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ తమ పాలన వచ్చిన తర్వాత రాష్ట్రాభివృద్ధిలో కొత్త శకం మొదలైందన్నారు.



7-8 ఏళ్ల క్రితం పరిస్థితులు చూసి ఆశ్చర్యంగా ఉండేవి. యూపీ ప్రజలను కొందరు ఎందుకు శిక్షిస్తున్నారో తెలిసేది కాదు. కానీ 2014లో మీరు నాకు అధికారం ఇచ్చిన తర్వాత అభివృద్ధిపై క్షేత్రస్థాయిలో మార్పులు చేశా. కానీ అప్పటి యూపీ సర్కార్ నాకు సహకరించలేదు. నాతో కలిసి నడిస్తే వారి ఓటు బ్యాంకులు పోతాయని భయపడేవారు. ఓ ఎంపీగా నేను యూపీకి వస్తే విమానాశ్రయం వద్ద నున్న ఆహ్వానించడానికి వచ్చేవాళ్లు. కానీ ఆ తర్వాత మాయమైపోయేవారు.  యోగి సర్కార్‌ కంటే ముందున్న ప్రభుత్వం యూపీకి చాలా అన్యాయం చేసింది. కేవలం కుటుంబ సంక్షేమం కోసమే వాళ్లు పని చేశారు. అందుకే యూపీ ప్రజలు వాళ్లను 2017లో దూరంగా పెట్టారు. -                                             ప్రధాని నరేంద్ర మోదీ


రహదారిపై ల్యాండింగ్..






లఖ్​నవూను యూపీలోని తూర్పున ఉండే ప్రాంతాలను కలుపుతూ 340.8 కిలోమీటర్ల మేర ఈ రహదారిని నిర్మించారు. ఆరు లేన్ల ఈ ఎక్స్​ప్రెస్ వే.. బారాబంకి, అమేఠీ, సుల్తాన్​పుర్, అయోధ్య, అంబేడ్కర్ నగర్, ఆజంగఢ్, మౌ, గాజీపుర్ జిల్లాలను కలుపుతుంది. రహదారిలో భాగంగా సుల్తాన్​పుర్ వద్ద 3.2 కిలోమీటర్ల ఎయిర్​స్ట్రిప్ సిద్ధం చేశారు. అత్యవసర సమయంలో యుద్ధ విమానాలు దిగేందుకు వీలుగా దీన్ని ఏర్పాటు చేశారు. ఈ ఎయిర్​స్ట్రిప్​పైనే మోదీ యుద్ధ విమానంలో దిగారు.


Also Read: WHO on Covid 19: కరోనా థర్డ్‌ వేవ్‌పై డబ్ల్యూహెచ్ఓ కీలక వ్యాఖ్యలు.. లైట్ తీసుకోవద్దని హెచ్చరిక


Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 8,865 కరోనా కేసులు.. గత 287 రోజుల్లో ఇదే అత్యల్పం


Also Read: ఒత్తిడి, ఆందోళన వేధిస్తున్నాయా? ప్రశాంతంగా లేదా? ఈ టీలను ప్రయత్నించండి


Also Read: చేపల్లో మాత్రమే కాదు, వీటిలో కూడా ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు... శాకాహారులకు ప్రత్యేకం


Also Read: మద్యం అతిగా తాగుతున్నారా... మీ చర్మం చెప్పేస్తుంది మీ తాగుడు గురించి...


Also Read:   వంటల్లో ఈ మూడు మసాలాలు కచ్చితంగా వాడండి, క్యాన్సర్ రిస్క్‌ను సగం తగ్గించుకోండి


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at: 16 Nov 2021 03:59 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.