ఐసిస్ అధినేతను అమెరికా బలగాలు మట్టుబెట్టాయి. గత రాత్రి జరిగిన ఉగ్రవాద వ్యతిరేక ఆపరషేన్‌లో ఐసిస్ చీఫ్‌ అబు ఇబ్రహీం అల్ హషిమీ అల్ ఖురేషిని అమెరికా సైన్యం హతమార్చింది. ఈ మేరకు అమెరికాక అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు.

 

సిరియాలో అంతర్గత వలసలు ఎక్కువగా ఉండే ఇడ్లిబ్ రాష్ట్రంలోని అత్మేహ్ అనే గ్రామంపై అమెరికా దళాలు మెరుపు దాడులు జరిపాయి. ఈ దాడిలో ఐఎస్​ఐఎస్​ నాయకుడితో పాటు 13 మంది పౌరులు కూడా మరణించారు.

 

ఇడ్లిబ్​ ప్రాంతం ఉగ్రమూకలకు స్థావరంగా మారింది. ఇక్కడ ఉగ్రకార్యకలాపాలు విచ్చలవిడిగా జరుగుతుంటాయి. ఇటీవలే ఈశాన్య సిరియాలో ఓ జైలును స్వాధీనం చేసుకోవడానికి 10 రోజుల పాటు ఉగ్రవాదులు దాడులు చేశారు.



అఫ్గానిస్థాన్‌లో వరుస బాంబు దాడులతో తాలిబన్లకు తలనొప్పి తెచ్చింది ఇస్లామిక్​ స్టేట్ (ఐసిస్)​. ముఖ్యంగా తాలిబన్లే లక్ష్యంగా వారి వాహనాలపై దాడులకు తెగబడుతోంది.











తాలిబన్​- ఇస్లామిక్​ స్టేట్​ మధ్య శత్రుత్వం కొత్తేమీ కాదు. అమెరికా దళాలు వెనుదిరగక ముందు నుంచే వీరి మధ్య శత్రుత్వం ఉంది. రెండు వర్గాలు కఠిన ఇస్లాం నిబంధనలు పాటిస్తాయి. కానీ వీరి సిద్ధాంతాల్లో కొంత వ్యత్యాసం ఉంది. అఫ్గానిస్థాన్​పై పట్టు కోసం తాలిబన్లు ఇన్నేళ్లు శ్రమించగా.. అంతర్జాతీయంగా 'జిహాద్​' కోసం ఐఎస్​ పిలుపునిచ్చింది.


అమెరికా, నాటో దళాలు వెనుదిరగక ముందే.. మెరుపు వేగంతో కాబుల్​ను ఆక్రమించుకున్నారు తాలిబన్లు. దేశాన్ని వీడేందుకు ప్రజలు ప్రయత్నిస్తోన్న సమయంలో కాబూల్​ విమానాశ్రయం వద్ద పేలుళ్లకు పాల్పడింది ఐసిస్​-కే. ఈ ఘటనలో అమాయక ప్రజలు, తాలిబన్​ ఫైటర్లు, అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయారు.


ఈ పరిణామాలతో.. అప్పటికే అస్తవ్యస్తంగా ఉన్న ఆ దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుదేలైంది. దేశం ప్రస్తుతం ఆర్థిక సంక్షోభం, భద్రత సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. ఈ తరుణంలో వాటిని మరింత పెంచే విధంగా తాలిబన్​ ప్రభుత్వానికి సవాళ్లు విసురుతోంది ఇస్లామిక్​ స్టేట్​.


Also Read: Galwan Valley Clash: 'చైనా అబద్ధం చెప్పింది.. గల్వాన్ ఘర్షణలో వారి సైనికుల మరణాలు 9 రెట్లు ఎక్కువ'


Also Read: UP Election 2022: యోగిపై ఈసీకి సమాజ్‌వాదీ ఫిర్యాదు.. సీఎం భాషపై అభ్యంతరం