Viral News: "నిద్ర లేచింది మహిళా లోకం- దద్దరిల్లింది పురుష ప్రపంచం" ఎన్‌టీఆర్, సావిత్రి నటించిన 'గుండమ్మ కథ' చిత్రంలో ఈ పాట సూపర్ ఫేమస్ అయింది. ఇప్పటికీ ఓల్డ్ హిట్స్‌లో ఈ పాట గ్యారెంటీ ఉంటుంది. అయితే సడెన్‌గా ఈ పాట ఎందుకు గుర్తొచ్చింది అనుకుంటున్నారా? ఈ మధ్య పబ్‌లో ఇద్దరు మహిళలు ఓ వ్యక్తిని పిచ్చ కొట్టుడు కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. 






ఇదీ జరిగింది


ఉత్తర్‌ప్రదేశ్‌ రాజధాని లఖ్‌నవూలో ఈ ఘటన జరిగింది. గురువారం రాత్రి పబ్‌ వెలుపల ఓ వ్యక్తిపై ఇద్దరు మహిళలు దాడి చేశారు. అందులోని ఓ మహిళ మరింత రెచ్చిపోయింది. అక్కడ పూల కుండీలతో అతడి తలపై కొట్టింది. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. 


ఇంతలో బౌన్సర్లు జోక్యం చేసుకున్నారు. మహిళల నుంచి ఆ వ్యక్తిని విడిపించారు. ఇద్దరినీ చెరో వైపునకు తీసుకెళ్లి.. మహిళలకు సర్ది చెప్పారు. అయితే అక్కడ ఉన్న కొందరు తమ మొబైల్‌ ఫోన్లలో ఇదంతా రికార్డు చేశారు. దీంతో ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.


అరెస్ట్


ఈ వీడియో పోలీసుల దృష్టికి వెళ్లడంతో ఆ వ్యక్తిని కొట్టిన ఇద్దరు మహిళలపై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు. అయితే ఆ వ్యక్తి మాత్రం పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. బాధిత వ్యక్తికి ఏమైంది, ఆసుపత్రికి తరలించారా అనే విషయాలపై ఎలాంటి స్పష్టత లేదు. అయితే ఆ వ్యక్తిని మహిళలు ఎందుకు కొట్టారో ఇంకా తెలియలేదు. 


ఈ వీడియో కింద నెటిజన్లు కూడా కామెంట్లు పెడుతున్నారు. ఆ మహిళలు ఫుల్‌గా తాగి అతనిపై దాడి చేశారని కొందరు అంటుంటే, మరి కొందరు మహిళలపై ఆ వ్యక్తి అభ్యంతరకంగా ప్రవర్తించి ఉంటాడని కామెంట్లు చేస్తున్నారు.


Also Read: Meghalaya: BJP నేత ఫాంహౌస్‌లో సెక్స్ రాకెట్- 73 మంది అరెస్ట్!


Also Read: Monkeypox Cases India: దేశంలో మంకీపాక్స్ డేంజర్‌బెల్స్- దిల్లీలో తొలి కేసు నమోదు!