Viral News in Telugu: మరాఠీ ఫిల్మ్‌మేకర్ స్వప్న వాఘ్‌మేర్‌ జోషి ఇంట్లో చొరబడిన దొంగకి వాళ్ల పెంపుడు పిల్లి చుక్కలు చూపించింది. ఇంట్లో ఒక్క వస్తువు కూడా ముట్టుకోకుండా బయటకు తరిమింది. ముంబయిలోని అపార్ట్‌మెంట్‌లో ఆరో అంతస్తులో ఉన్న దర్శకుడి ఇంట్లోకి దొంగ కిటికీలో నుంచి చొరబడ్డాడు. మెల్లగా ఏదో ఒకటి కాజేద్దామనుకున్నాడు. కానీ ఆ డైరెక్టర్ ఇంట్లోని పిల్లి మాత్రం ఒక్కసారిగా ఆ దొంగపై దాడి చేసింది. బయటకు పరిగెత్తేంత వరకూ తరిమింది. అక్కడి సీసీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఈ సీసీటీవీ ఫుటేజ్ చూసి షాకైన డైరెక్టర్ స్వప్న వాఘ్‌మేర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టారు. తెల్లవారుజామున 3 గంటలకు ఈ ఘటన జరిగినట్టు అందులో రికార్డ్ అయింది. ముందుగా ఓ బెడ్‌రూమ్‌లోకి వెళ్లాడు దొంగ. అక్కడే జోషి వాళ్ల తల్లి, ఆమె కేర్‌టేకర్ నిద్రిస్తున్నారు. అక్కడి నుంచి మెల్లగా మరో బెడ్‌రూమ్‌లోకి వెళ్లాడు. అక్కడా పర్స్‌ని కొట్టేశాడు. అక్కడి నుంచి బయటపడాలని చూస్తుండగా పెంపుడు పిల్లి గట్టిగా అరిచింది. ఈ అరుపులతో అందరూ నిద్ర లేచారు. దొంగని చూసి పట్టుకోడానికి ప్రయత్నిచారు. కానీ ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు. 




మరో ఫిల్మ్‌మేకర్ అశోక్ పండిట్‌ ఈ వీడియోని పోస్ట్ చేశాడు. వృద్ధులు ఇంట్లో ఉన్న వాళ్లు కాస్త జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరించాడు. ఈ సీసీటీవీ ఫుటేజ్ చూసి షాక్ అయ్యాయని అన్నాడు. చాలా సులువుగా పై వరకూ వచ్చేశాడని చెప్పాడు. సెక్యూరిటీ గార్డ్‌లు ఫోన్‌లలో మునిగిపోతున్నారని అసహనం వ్యక్తం చేశాడు. ఈ ఘటనపై స్వప్న వాఘ్‌మేర్ జోషి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇలాంటివి షేర్ చేసి అందరినీ అలెర్ట్ చేసినందుకు థాంక్స్ అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. వాచ్‌మెన్‌లు రాత్రి పూట పడుకుంటున్నారా అంటూ మరి కొందరు ఫైర్ అయ్యారు. 


Also Read: Social Media Policy: ఇన్‌ఫ్లుయెన్సర్‌ల ఇన్‌కమ్‌పై ప్రభుత్వం ఆంక్షలు, అలాంటి పోస్ట్‌లు పెడితే జీవిత ఖైదు తప్పదు