కొత్తగా ప్రమాణం చేసిన 11 మంది మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి  శాఖలు కేటాయించారు. నిన్న ఢిల్లీ వెళ్లి అధినాయకత్వంతో చర్చించి శాఖలు కేటాయించారు. ఆయా మంత్రులకు శాఖలు కేటాయించినట్టు రాజ్‌భవన్‌కు సందేశం సీఎం కార్యాలయం పంపించింది.

  


సీఎం రేవంత్ రెడ్డి వద్ద హాం శాఖ 
సీఎం రేవంత్ రెడ్డి వద్దే హోంశాఖతోపాటు ఇతర కీలకమైన శాఖలు ఉండబోతున్నాయి. మిగతా మంత్రుల ఖాళీలు భర్తీ అయ్యేంత వరకు ఆ శాఖలు ఆయన చూస్తారు. ఆయన వద్ద మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ &అర్బన్ డెవలప్‌మెంట్, జనరల్ అడ్మినిస్ట్రేషన్, లా & ఆర్డర్, కేటాయించని విద్య ఇతర శాఖలు కూడా ఉన్నాయి. 
డిప్యూటీ సీఎంగా ఉన్న మల్లు భట్టి విక్రమార్కకు కీలకమైన శాఖలు కేటాయించారు. ఆర్థిక శాఖతోపాటు విద్యుత్ శాఖ బాధ్యతలను కూడా అప్పగించారు.  


మిగతా మంత్రులకు కేటాయించిన శాఖలు ఇలా ఉన్నాయి. 


ఉత్తమ్‌ కుమార్ రెడ్డి - నీటిపారుదల, సీఏడీ, ఫుడ్‌ అండ్‌ సివిల్ సప్లై
దామోదర్ రాజనర్సింహా- వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, సైన్స్ అండ్‌ టెక్నాలజీ  
కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి- రోడ్లు భవనాల శాఖ, సినిమాటోగ్రఫీ 
దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు- ఐటీ, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్ ఇండస్ట్రీస్ & కామర్స్ లెజిస్లేటివ్ అఫైర్స్
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి- రెవన్యూ, హౌసింగ్‌, సమాచార శాఖ 
పొన్నం ప్రభాకర్‌- రవాణా, బీసీ వెల్ఫేర్‌ శాఖ 
కొండా సురేఖ- ఎన్విరాన్‌మెంట్‌, అటవీశాఖ, దేవాదాయ శాఖ 
అనసూయ సీతక్క - పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి, స్త్రీశిశుసంక్షేమ  శాఖ 
తుమ్మల నాగేశ్వరరావు- వ్యవసాయ శాఖ, చేనేత శాఖ, మార్కెటింగ్ కోఆపరేషన్,  
జూపల్లి కృష్ణారావు- ఎక్సై్‌ శాఖ, పర్యాటక సాంస్కృతిక శాఖ