KA Paul Met Telangana CM Revanth Reddy: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని (Revanth Reddy) సోమవారం మర్యాద పూర్వకంగా కలిశారు. హైదరాబాద్ (Hyderabad) జూబ్లీహిల్స్ (Jubileehills)లోని సీఎం నివాసంలో ఆయనతో భేటీ అయ్యారు. వచ్చే ఏడాది జనవరి 30న హైదరాబాద్ లో జరిగే ప్రపంచ శాంతి సదస్సుకు హాజరు కావాలని సీఎంను ఆయన కోరారు. అలాగే, సదస్సు నిర్వహణకు కావాల్సిన అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని కేఏ పాల్ తెలిపారు. సదస్సుకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులను సైతం ఆహ్వానించినట్లు చెప్పారు. పలు దేశాల నుంచి వేలాది మంది ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని అన్నారు.


Also Read: Sunburn Event Controversy: సన్ బర్న్ వివాదంలో బుక్ మై షో నిర్వాహకులపై కేసు - ఈవెంట్ కు అనుమతి లేదన్న సీపీ మహంతి