Pant Car Accident: పంత్ త్వరగా కోలుకోవాలని ప్రధాని మోదీ ట్వీట్

ABP Desam   |  Murali Krishna   |  30 Dec 2022 05:31 PM (IST)

Pant Car Accident: టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ త్వరగా కోలుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.

(Image Source: Getty Images)

Pant Car Accident: కారు ప్రమాదంలో గాయపడిన టీమిండియా క్రికెటర్ రిషబ్‌ పంత్‌ త్వరగా కోలుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. పంత్ త్వరగా కోలుకోవాలని మోదీ ట్వీట్ చేశారు.

ప్రముఖ క్రికెటర్ రిషబ్ పంత్ యాక్సిడెంట్‌ వార్త విని దిగ్భ్రాంతి చెందాను. అతను త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.                 -     ప్రధాని మోదీ

ఘోర ప్రమాదం

ఉత్తరాఖండ్‌ రూర్కీలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో క్రికెటర్‌ రిషబ్‌ పంత్‌ తీవ్రంగా గాయపడ్డాడు. అతను ప్రయాణిస్తున్న కారు డివైడర్‌ను ఢీ కొట్టిన ఘటనలో రిషబ్‌కు గాయాలయ్యాయి. ప్రస్తుతం పంత్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రమాదంలో అతను ప్రయాణిస్తున్న కారు పూర్తిగా దగ్ధమైంది.

దిల్లీ నుంచి ఉత్తరాఖండ్‌ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దిల్లీ, దెహ్రాదూన్ హైవేలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగినప్పుడు ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగడంతో కారు నుంచి పంత్‌ కిందకి దూకేసినట్టు పోలీసులు చెప్పారు. ఆయనే ఒంటరిగా డ్రైవ్ చేసుకొని వస్తున్న టైంలో ఈ దుర్ఘటన జరిగింది. 

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి రూర్కీలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రిషబ్ పంత్ త్వరగా కోలుకోవాలని క్రికెటర్లు, క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. వీవీఎస్‌ లక్ష్మణ్‌ ట్వీట్ చేస్తూ పెను ప్రమాదం తప్పిందుకు దేవుడికి థ్యాంక్స్ చెప్పారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. గెట్‌వెల్‌ సూన్‌ ఛాంప్ అంటూ ట్వీట్ చేశారు. 

బీసీసీఐ

రిషబ్ పంత్‌కు అత్యుత్తమ వైద్య సదుపాయాలు కల్పిస్తామని బీసీసీఐ తెలిపింది. అతడి నదురుపై రెండు చోట్ల గాట్లు పడ్డాయని, కుడి మోకాలిలో చీలిక వచ్చిందని పేర్కొంది. ప్రస్తుతానికి అతడి పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించింది.

రిషబ్ పంత్‌ నుదురుపై రెండు గాట్లు ఉన్నాయి. కుడి మోకాలిలోని లిగమెంట్లలో చీలిక వచ్చింది. అతడి కుడి చేతి మణికట్టు, కుడి కాలి పాదం, మడమల్లో గాయాలు అయ్యాయి. వెన్నెముక భాగంలోనూ కాలిన గాయాలు ఉన్నాయి. ప్రస్తుతానికి అతడి పరిస్థితి మెరుగ్గా ఉంది. ప్రాథమిక చికిత్స తర్వాత దెహ్రాదూన్‌లోని మాక్స్‌ ఆస్పత్రికి తరలించాం. పంత్‌ గాయాల తీవ్రత తెలుసుకొనేందుకు ఎమ్మారై స్కానింగ్‌ చేస్తున్నారు. ఏమైందో తెలియగానే పూర్తి స్థాయి చికిత్స చేస్తారు. పంత్‌ కుటుంబ సభ్యులు, వైద్య బృందంలోని డాక్టర్లతో బీసీసీఐ నిరంతరం సంప్రదిస్తూనే ఉంది. వైద్యులు అతడికి అత్యుత్తమ చికిత్స అందిస్తున్నారు. -  బీసీసీఐ 

Also Read: Rajnath Singh: 'పొరుగు దేశాలతో మంచి సంబంధాలు కావాలి- కానీ అలా కాదు'

Published at: 30 Dec 2022 04:51 PM (IST)
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.