Nirmala Sitharaman Hospitalised: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం ఆసుపత్రిలో చేరారు. దిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌ (ఎయిమ్స్‌)లో ఆమె చేరినట్లు వార్తా సంస్థ పీటీఐ పేర్కొంది.






63 ఏళ్ల నిర్మలా సీతారామన్ ఆసుపత్రిలోని ప్రైవేట్ వార్డులో చేరినట్లు సమాచారం. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే రిటీన్ చెకప్‌లో భాగంగానే ఆమె ఆసుపత్రికి వెళ్లినట్లు అధికార వర్గాలు తెలిపాయి.