Narendra Modi: ప్రధాని మోదీకి భూటాన్ అత్యున్నత పౌర పురస్కారం

ABP Desam   |  Murali Krishna   |  17 Dec 2021 06:05 PM (IST)

ప్రధాని నరేంద్ర మోదీకి తమ దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రకటించింది భూటాన్.

ప్రధాని మోదీకి భూటాన్ అత్యున్నత పౌర పురస్కారం

ప్రధాని నరేంద్ర మోదీకి భూటాన్.. తమ దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రకటించింది​. నేడు భూటాన్​ నేషనల్​ డే సందర్భంగా మోదీకి ఈ అవార్డు బహుకరించనున్నట్లు వెల్లడించింది.

ఈ విషయాన్ని ఆ దేశ ప్రధాన మంత్రి కార్యాలయం ట్విట్టర్​ ద్వారా వెల్లడించింది. కరోనా విపత్తు వేళ మోదీ అందించిన మద్దతుకు గుర్తింపుగా ఈ 'నాడగ్ పెల్ గి ఖోర్లో' అవార్డును అందిస్తున్నట్లు భూటాన్​ ప్రధాని మంత్రి కార్యాలయం పేర్కొంది.

'నాడగ్​ పెల్​ గి ఖోర్లో'గా పేర్కొనే ఈ అవార్డును భూటాన్​ రాజు జిగ్మే ఖేసర్​ నగ్మే వాంగ్​చుక్​.. మోదీకి బహుకరించాలని సూచించినట్లు తెలిపింది.

మోదీ అర్హులు..

భూటాన్​ ప్రజల తరఫున మోదీకి శుభాకాంక్షలు. ఈ అవార్డు అందుకోవడానికి ఆయన అర్హులు. ఆధ్యాత్మిక భావాలు ఉన్న గొప్ప వ్యక్తి మోదీ. ఈ అవార్డు బహుకరణ నేపథ్యంలో మీ రాక కోసం ఎదురుచూస్తున్నాం.                                                               - భూటాన్​ పీఎంఓ

కృతజ్ఞతలు..

ఈ అవార్డు తనకివ్వడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. భూటాన్ దేశం చూపిన ప్రేమకు ముగ్ధుడనయ్యానన్నారు.

కృతజ్ఞతలు లొటాయ్ షెరింగ్ @PMBhutan. మీరు చూపిస్తోన్న ప్రేమకు సర్వదా కృతజ్ఞుడిని. భూటాన్ రాజుకు నా కృతజ్ఞతలు                                          - ప్రధాని నరేంద్ర మోదీ

 

Also Read: India's Omicron Tally: దేశంలో 100 దాటిన ఒమిక్రాన్ కేసులు.. 11 రాష్ట్రాల్లో వ్యాప్తి

Also Read: Karnataka Congress MLA: 'స్పీకర్ సారు, ఎమ్మెల్యే గారు.. అది జోక్ కాదండి.. బాధ్యత ఉండక్కర్లేదా?'

Also Read: Omicron Cases in Delhi: దేశ రాజధానిలో ఒమిక్రాన్ దడ.. కొత్తగా మరో 10 కేసులు

Also Read: Miss World 2021: మిస్ వరల్డ్ పోటీలపై కరోనా పంజా.. మిస్ ఇండియా సహా 17 మందికి సోకిన వైరస్

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at: 17 Dec 2021 06:05 PM (IST)
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.