Jet Crash: రాజస్థాన్ లో కుప్పకూలిన మిగ్-21.. పైలెట్ సురక్షితం

ABP Desam Updated at: 25 Aug 2021 10:22 PM (IST)

భారత వాయుసేనకు చెందిన మిగ్-21 బైసన్ ఫైటర్ యుద్ధ విమానం రాజస్థాన్ లోని బాడ్ మేర్ లో నేడు కుప్పకూలింది. ఈ ఘటనపై ఐఏఎఫ్ విచారణకు ఆదేశించింది.

రాజస్థాన్ లో కుప్పకూలిన మిగ్-21

NEXT PREV

వైమానిక దళానికి చెందిన మిగ్‌-21 బైసన్ ఫైటర్‌ యుద్ధ విమానం సాంకేతిక సమస్య కారణంగా కూలిపోయింది. రాజస్థాన్‌లోని బాడ్​మేర్​లో సాయంత్రం 5:30 గంటల సమయంలో కూలిపోయింది.















మిగ్-21 బైసన్ ఫైటర్ యుద్ధ విమానం.. శిక్షణ కోసం టేకాఫ్ అవుతున్న సమయంలో సాంకేతిక లోపం తలెత్తి కుప్పకూలింది.                           -     వాయుసేన


ప్రమాదం జరిగిన సమయంలో యుద్ధ విమానం సాధారణ శిక్షణలో ఉందని భారత వైమానిక దళ అధికారులు తెలిపారు. ఒక్కసారిగా యుద్ధ విమానం నేలకూలడం వల్ల భారీగా మంటలు చెలరేగాయి. దీంతో విమానం కాలిబూడిదైంది. ఈ ఘటనలో పైలట్ సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనపై ఐఏఎఫ్‌ విచారణకు ఆదేశించింది.


Also Read: Kerala Covid 19 Cases: కేరళలో కరోనా విలయతాండవం.. కొత్తగా 31,445 కేసులు

Published at: 25 Aug 2021 10:16 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.