National Monetisation Plan: 'రాహుల్.. అసలు మానిటైజేషన్ అంటే ఏంటో తెలుసా?'

ABP Desam   |  25 Aug 2021 08:13 PM (IST)

రాహుల్ గాంధీపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీకి అసలు మానిటైజేషన్ అంటే ఏంటో తెలుసా అని ప్రశ్నించారు నిర్మలా.

రాహుల్ గాంధీపై నిర్మలా సీతారామన్ వ్యంగ్యాస్త్రాలు

నేషనల్ మానిటైజేషన్ ప్లాన్ పై ప్రతిపక్షాలు చేసిన విమర్శలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తిప్పికొట్టారు. తాము ఏ ఆస్తులను అమ్మడం లేదని వాటిని లీజ్ కు మాత్రమే ఇస్తున్నామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ఈ అంశంపై ప్రతిపక్షాలు మరింత కసరత్తు చేయాలి. అసలు రాహుల్ గాంధీకి మానిటైజేషన్ అంటే అర్థం తెలుసా? అని నాకు సందేహంగా ఉంది. దేశ ఖనిజాలు, నీళ్లు, గాలిని కూడా కాంగ్రెస్ అమ్మేసింది. కానీ మేం పర్యవేక్షణ లేని ప్రభుత్వ ఆస్తులను మానిటైజేషన్ విధానం ద్వారా- వినియోగించాలనుకుంటున్నాం. రూ.8వేల కోట్లకు ముంబయి-పుణె ఎక్స్ ప్రెస్ వేను ఎవరు అమ్మేశారు? సోనియా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు దిల్లీ రైల్వేస్టేషన్ ను లీజ్ కు ఇచ్చేందుకు రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్ఎఫ్ క్యూ) పెట్టారు. మరి రాహుల్ గాంధీ మానిటైజేషన్ కు వ్యతిరేకం అయితే ఈ ప్రపోజల్ ను అప్పుడు ఎందుకు వ్యతిరేకించలేదు.                                   - నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక మంత్రి

Also Read: Rahul Gandhi Press Meet: ఇది ప్రైవేటీకరణ కాదు.. దేశాన్ని అమ్మేయడం: రాహుల్ గాంధీ

కాంగ్రెస్ విమర్శలు..

కేంద్రం ప్రకటించిన నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ ను కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకించింది. 70 ఏళ్లలో కాంగ్రెస్ నిర్మించిన ఆస్తులను మోదీ సర్కార్ అమ్మకానికి పెట్టిందని రాహుల్ గాంధీ విమర్శించారు. ప్రైవటీకరణ పేరుతో దేశంలో ఆస్తులను మోదీ అమ్మేస్తున్నారని రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Also Read: Asset Monetisation Plan: మోదీజీ.. ఇవేం మీ ఆస్తులు కాదు అమ్మేయడానికి: దీదీ

Published at: 25 Aug 2021 08:07 PM (IST)
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.