2022 ఏడాదిలో తన తొలి మన్‌కీ బాత్ ప్రసంగంలో కీలక వ్యాఖ్యలు చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. మహాత్మా గాంధీ వర్ధంతి, గణతంత్ర వేడుకలు సహా పలు అంశాలపై ప్రధాని మోదీ మాట్లాడారు.


హైలెట్స్..




    •  ఇండియా గేట్​ వద్ద ఉన్న అమర జవాన్​ జ్యోతిని, జాతీయ యుద్ధ స్మారకం వద్ద ఉన్న జ్యోతితో కలిపిన క్షణం అమరుల కుటుంబీకులు భావోద్వేగానికి గురయ్యారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆ సమయంలో వారి కళ్లు చెమర్చాయని మోదీ అన్నారు.

    • ఈ జ్యోతి విలీనం చేయడాన్ని హర్షిస్తూ ఎందరో మాజీ సైనికులు తనకు లేఖ రాశారని మోదీ అన్నారు. జాతీయ యుద్ధ స్మారకంలో అమర జవాన్ జ్యోతిని విలీనం చేసి అమరులకు ఘన నివాళి ఇచ్చినట్లు అయిందని వారు లేఖలో పేర్కొన్నట్లు తెలిపారు

    • ఈ మన్‌కీ బాత్ కోసం దాదాపు కోటి పోస్ట్‌ కార్డులు తనకు పిల్లలు పంపించారని మోదీ అన్నారు. తమ మన్‌కీ బాత్‌ను వారు పోస్ట్ కార్డ్‌లో రాసి పంపారన్నారు.







  • రాష్ట్రపతి బాడీగార్డ్​ కమాండెంట్ సవారీ చేసే గుర్రం విరాట్​ ఇటీవల పదవీ విరమణ పొందడాన్ని కూడా మన్‌కీ బాత్‌లో మోదీ ప్రస్తావించారు.


  • కరోనాపై భారత్.. విజయవంతంగా పోరాటం చేస్తోందని మోదీ అన్నారు. ఇప్పటికే 4.5 కోట్ల మంది చిన్నారులు వ్యాక్సిన్ పొందడం గర్వంగా ఉందన్నారు. 

  • అవినీతి చెదపురుగు వంటిదని మోదీ పేర్కొన్నారు. దేశాన్ని తీవ్రంగా దెబ్బతీసే అవినీతి నుంచి భారత్​కు వీలైనంత త్వరగా విముక్తి కలిగించాలన్నారు. మన విధులకు ప్రాధాన్యం ఇస్తే అవినీతి ఉండదని మోదీ సూచించారు.
     



Also Read: Covid Update: దేశంలో తగ్గిన కరోనా కేసులు.. పెరిగిన మరణాలు.. ఒక్కరోజులో 893 మంది మృతి


Also Read: Canada PM Justin: అజ్ఞాతంలోకి ఆ దేశ ప్రధాని.. వ్యాక్సిన్ వ్యతిరేక ఆందోళనలతో కెనడా ఉక్కిరిబిక్కిరి