దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కొత్తగా 2,34,281 కరోనా కేసులు నమోదుకాగా 893 మంది మృతి చెందారు. తాజాగా 3,52,784 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 







యాక్టివ్ కేసులు: 18,84,937(4.59%)


డైలీ పాజిటివిటీ రేటు: 14.50%


మొత్తం వ్యాక్సినేషన్: 1,65,70,60,692


వ్యాక్సినేషన్..







భారత్​లో టీకా పంపిణీ వేగంగా కొనసాగుతోంది. శనివారం ఒక్కరోజే 62,22,682 డోసులు అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,65,70,60,692కు చేరింది.


దేశంలో 75 శాతానికి పైగా అర్హులైన వారికి పూర్తి స్థాయిలో వ్యాక్సినేషన్ అయినట్లు కేంద్ర మంత్రి మన్‌సుఖ్ మాండవీయ తెలిపారు. 





మహారాష్ట్ర..




మహారాష్ట్రలో కొత్తగా 27,971 మంది కరోనా సోకింది. 85 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. 61 మంది కరోనాతో మృతి చెందారు.


దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 76,83,525కు చేరింది. మరణాల సంఖ్య 1,42,522కు పెరిగింది. మరణాల రేటు 1.85గా ఉంది.


కొత్తగా నమోదైన 85 ఒమిక్రాన్ కేసుల్లో 44 పుణె, 39 ముంబయిలో నమోదయ్యాయి. 


Also Read: Gandhi Death Anniversary: గాంధీని చంపిన ముఠాలో తెలుగు వ్యక్తి కూడా..! కానీ ఆయన్ని నిర్దోషిగా తేల్చిన కోర్టు, ఎలాగంటే..


Also Read: SBI RD Rates: గుడ్ న్యూస్.. ఫిక్స్‌డ్ డిపాజిట్, ఆర్‌డీలపై వడ్డీ రేట్లు పెంచిన ఎస్‌బీఐ.. సవరించిన రేట్లు ఇవే