All Party Meeting: 


ఆల్‌ పార్టీ మీటింగ్..


ఈ నెల 18 నుంచి 22 వరకూ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు (Parliament Special Session) పిలుపునిచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన చేశారు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి. అయితే ఇంత వరకూ ఈ సమావేశాల అజెండా ఏంటో మోదీ సర్కార్ ప్రకటించలేదు. దీనిపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. ఈ క్రమంలోనే కేంద్ర మరో కీలక ప్రకటన చేసింది. సెప్టెంబర్ 17వ తేదీన అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చింది. ప్రత్యేక సమావేశాల అజెండాపై చర్చించేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేసింది.