ప్రధాని నరేంద్ర మోదీ శనివారం సాయంత్ర వీడియో కాన్ఫరెన్స్ ద్వారా.. కొత్త హంగులు సంతరించుకున్న జలియన్ వాలాబాగ్ స్మారాకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా స్మారకాన్ని జాతికి అంకితం చేశారు. స్మారకంలో అభివృద్ధి చేసిన మ్యూజియం గ్యాలరీలను కూడా ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ హాజరయ్యారు. 


నాలుగు మ్యూజీయం గ్యాలరీలు, నిరూపయోగంగా ఉన్న భవనాలకు కొత్త హంగులు.. అద్దారు.  దీర్ఘకాలం పాటు పరిమిత ఆదరణకు మాత్రమే నోచుకున్న ఈ చారిత్రక ప్రాంతం ఇప్పుడు నూతన హంగులను సంతరించుకుంది. అప్పట్లో పంజాబ్ లో జరిగిన సంఘటనలు, చారిత్రక వస్తువులను ఈ గ్యాలరీలో పెట్టారు. 


Also Read: Bengal BJP vs Mamata : దీదీ మేనల్లుడికి ఈడీ సమన్లు.. బెంగాల్‌లో మళ్లీ రాజకీయ రచ్చ..!


అమృత్‌‌సర్‌‌లోని జలియన్‌‌వాలా బాగ్ మెమోరియల్ కాంప్లెక్స్ ను నాలుగు మ్యూజియం గ్యాలరీలతో రినోవేట్​ చేశారు. మ్యూజియం గ్యాలరీల ఏర్పాటులో మోడర్న్​ ఆడియో విజువల్​ టెక్నాలజీ వాడారు. ఏప్రిల్ 13న జరిగిన ఘటనను ప్రదర్శించడానికి ప్రత్యేకంగా సౌండ్ అండ్ లైట్ షో ఏర్పాటు చేశారు. పంజాబ్​లో జరిగిన సంఘటనలు కళ్లకుకట్టేలా శిల్ప సౌందర్యాన్ని తీర్చిదిద్దారు. లోకల్​ ఆర్కిటెక్చర్​ శైలికి అనుగుణంగా మెమోరియల్ ​కాంప్లెక్స్​ హెరిటేజ్​ రినోవేషన్​ పనులు చేపట్టారు. 


Also Read: Aadhaar-PAN: ఆధార్, పాన్ లింక్ సేవల్లో అవాంతరాలకు చెక్.. సక్రమంగా పనిచేస్తున్నాయన్న యూఐడీఏఐ


స్వాతంత్య్ర ఉద్యమకాలంలో పంజాబ్‌లో జరిగిన వివిధ ఘటనలకు గుర్తుగా ఈ ప్రాంతం పేరొందింది. ఇప్పుడు ఈ ప్రాంతంలో పలు అభివృద్ధి పనులు జరిగాయి. జ్వాలా స్మారకానికి మరమ్మతులు చేయడంతో పాటు, పలు పునర్నిర్మాణ పనులు చేపట్టారు. ‘లిలీ తలాబ్’ను అభివృద్ధి చేయడంతో పాటు రహదారులను మరింత విశాలంగా మార్చారు. 


Also Read: Super Stalin : స్టాలిన్ సూపర్..! ఆ బ్యాగుల వల్ల తమిళనాడు సీఎంకు ఎన్ని ప్రశంసలంటే..?


దేశ స్వాతంత్య్ర పోరాటంలో నెత్తుటి అధ్యాయం ఘ‌‌ట‌‌న జ‌‌లియ‌‌న్ వాలాబాగ్‌‌. 1919 ఏప్రిల్‌‌13న వైశాఖి పర్వదిన వేడుకల్లో పాల్గొన్న అమాయకులపై బ్రిటీష్‌‌ బ్రిగేడియర్‌‌- జనరల్‌‌ రెజినాల్డ్‌‌ డయ్యర్‌‌ నిర్దాక్షిణ్యంగా కాల్పులు జరిపించాడు. ఈ మార‌‌ణ‌‌కాండలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. మాతృభూమి విముక్తి కోసం ప్రాణాలను పణంగా పెట్టిన అమరుల త్యాగాలను గుర్తు చేసుకునేందుకు అమృత్​సర్ ​సిటీలో జలియన్​వాలాబాగ్​ స్మారకాన్ని ఏర్పాటు చేశారు. 


Also Read: Uthra Murder Case: పాముతో సీన్ రీ కన్ స్ట్రక్షన్.. ఇప్పటి వరకు ఎప్పుడూ చూడని ఇంట్రస్టింగ్ కేసు ఇది


BH' registration series: వాహనదారులకు కేంద్రం గుడ్ న్యూస్... కొత్తగా బీహెచ్ సిరీస్.. మళ్లీ రిజిస్ట్రేషన్ అవసరం లేదు