Landslide Strikes Manipur: మణిపుర్లో ఘోర ప్రమాదం జరిగింది. నోనే జిల్లాలోని తుపుల్ రైల్వే స్టేషన్ వద్ద ఉన్న ఆర్మీ క్యాంప్ వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. ఈ మేరకు ఏఎన్ఐ వార్తా సంస్థ వెల్లడించింది.
45 మంది
ఈ ఘటనలో మొత్తం 45 మంది వరకు గల్లంతయినట్లు అధికారులు తెలిపారు. ఏడుగురు మృతదేహాలు లభ్యమయ్యాయని వెల్లడించారు.
సీఎం సమావేశం
ఈ ఘటనపై మణిపుర్ సీఎం బిరేన్ సింగ్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ప్రస్తుత పరిస్థితులను సమీక్షించేందుకు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
Also Read: Udaipur Murder Case: జైపుర్లో భారీ ఉగ్రదాడికి ప్లాన్ చేసిన 'ఉదయ్పుర్' హంతకులు
Also Read: MVA Crisis: శివసేన అధికారం కోసం పుట్టలేదు, అధికారమే శివసేన కోసం పుట్టింది: సంజయ్ రౌత్