రెబల్‌ ఎమ్మెల్యేలు గువాహటి నుంచి మాట్లాడటం కాదు. ముంబయికి తిరిగి వచ్చి సీఎంతో చర్చించాలి. 24 గంటల్లో ఎమ్మెల్యేలంతా ముంబయికి రావాలి. అప్పుడు కూటమి నుంచి బయటకు వచ్చే అంశాన్ని కూడా పరిశీలిస్తాం. ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి పదవికి ఎలాంటి ఢోకా లేదు. బలపరీక్ష జరిగినప్పుడు అందరూ చూస్తారు. విశ్వాస పరీక్ష వరకూ వస్తే అధికార కూటమి మహా వికాస్ అఘాడీ గెలుస్తుంది. శివసేనకు ద్రోహం చేయాలనుకునేవారు బాల్‌ ఠాక్రే అనుచరులు, నిజమైన శివ సైనికులు కాలేరు.                                 - సంజయ్‌ రౌత్‌, శివసేన ఎంపీ