Madhya Pradesh ABP Cvoter Opinion Poll:



మధ్యప్రదేశ్‌ ఎన్నికల ట్రెండ్‌పై ABP Cvoter ఒపీనియన్ పోల్ ఆసక్తికర అంచనాలు వేసింది. మొత్తం 230 సీట్లలో 119 సీట్లు కాంగ్రెస్ గెలుచుకుంటుందని ఈ పోల్ తెలిపింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కి 114 సీట్లు వచ్చాయి. కానీ ఈ సారి మరో ఐదు సీట్లు అదనంగానే వస్తాయని ఈ పోల్‌లో తెలింది. ఇక బీజేపీకి 110 సీట్లు వస్తాయని అంచనా వేసింది. గత ఎన్నికల్లో 109 సీట్లు గెలుచుకుంది. బీఎస్‌పీకి ఒక సీట్‌, ఇతరులు ఒక సీటు గెలుచుకుంటారని తెలిపింది. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కి 113-125 సీట్లు, బీజేపీకి 104-116 స్థానాలు వస్తాయని స్పష్టం చేసింది. 




మధ్యప్రదేశ్‌లో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. రాష్ట్రంలో 230 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఇప్పటికే ఎన్నికలకు సంబంధించిన కసరత్తు పూర్తి చేసింది ఈసీ. నవంబర్ 17న ఎన్నికలు నిర్వహించనున్నారు. డిసెంబర్ 3వ తేదీన ఫలితాలు వెల్లడవుతాయి. ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. మధ్యప్రదేశ్‌లో మొత్తం 5.52 కోట్ల మంది ఓటర్లున్నారు. వీళ్లలో 2.85 కోట్ల మంది పురుషులు కాగా...2.67 కోట్ల మహిళా ఓటర్లున్నారు. ఈసారి కొత్తగా 18.86 లక్షల మంది ఓటర్లను జాబితాలో చేర్చింది ఈసీ. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. అయితే...కాంగ్రెస్ గట్టి పోటీనే ఇచ్చింది. దాదాపు 15 ఏళ్లుగా రాష్ట్రంలో బీజేపీయే అధికారంలో కొనసాగుతోంది. ప్రతిసారీ కాంగ్రెస్ నుంచి గట్టి పోటీనే ఎదుర్కొంటోంది. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ని కమల్‌ నాథ్ లీడ్ చేస్తున్నారు. ఒకప్పుడు ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2018-20 మధ్య కాంగ్రెస్ హయాంలో సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. 2020లో కొంత మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడడం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం కుప్ప కూలింది. అప్పుడు బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఈ సారి ఎలాగైనా అధికారాన్ని దక్కించుకోవాలన్న పంతంతో ఉంది కాంగ్రెస్


దూకుడు పెంచిన కాంగ్రెస్..


కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ బీజేపీని గాడ్సేతో పోల్చారు. కాంగ్రెస్‌కి, బీజేపీకి మధ్య ఉన్న తేడాలేంటో చెబుతూ ఆ పార్టీపై విమర్శలు గుప్పించారు. మధ్యప్రదేశ్‌లోని షాజాపూర్‌లో జన్ ఆక్రోశ్ కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్...రాబోయే ఎన్నికలను రెండు సిద్ధాంతాల మధ్య జరగనున్న యుద్ధంగా అభివర్ణించారు. ఓ వైపు బీజేపీ, ఆర్ఎస్ఎస్‌ మరోవైపు కాంగ్రెస్ తలపడనున్నాయని అన్నారు. మహాత్మా గాంధీ ఐడియాలజీ కాంగ్రెస్‌ది అయితే...బీజేపీది గాడ్సే ఐడియాలజీ అని మండి పడ్డారు. 


"రాబోయే ఎన్నికలు రెండు సిద్ధాంతాల మధ్య యుద్ధం లాంటిదే. ఓ వైపు మహాత్మా గాంధీజీ సిద్ధాంతాలను అనుసరించే కాంగ్రెస్ పార్టీ. మరో వైపు గాడ్సే ఐడియాలజీని ఫాలో అయ్యే బీజేపీ, ఆర్ఎస్ఎస్. ఈ రెండు సిద్ధాంతాల మధ్య పోటీ జరగనుంది. ఇది విద్వేషం, ప్రేమకి మధ్య జరిగే యుద్ధం. బీజేపీ నేతలు ఎక్కడికి వెళ్లినా విద్వేషాలనే ప్రచారం చేస్తారు. మధ్యప్రదేశ్‌లోనూ ఇదే చేశారు. అందుకే ఇక్కడి ప్రజలు బీజేపీపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. యువత కూడా ఆగ్రహంతో ఉంది. ప్రజలకు వాళ్లు ఏదైతే చేశారో..అదే ఇప్పుడు వాళ్లకి తిరిగొస్తోంది"


- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ


Also Read: ABP C Voter Opinion Poll: తెలంగాణ ప్రజలు ఇప్పటికప్పుడు ఎవరికి ఓటేయబోతున్నారు ? - సీఓటర్ సర్వేల్లో ఊహించని విషయాలు 


[Disclaimer: Current survey findings and projections are based on CVoter Pre Poll personal interviews (Face to Face) conducted among 18+ adults statewide, all confirmed voters (sample size 11,928). The data is weighted to the known demographic profile of the States. Sometimes the table figures do not sum to 100 due to the effects of rounding. Our final data file has Socio-Economic profile within +/- 1% of the Demographic profile of the State. We believe this will give the closest possible trends. The sample spread is across all Assembly segments in the poll bound state. MoE is +/- 3% at macro level and +/- 5% at micro level VOTE SHARE projection with 95% Confidence interval. ]