Karnataka BJP MLA : సమస్యను పరిష్కరించాలని ఓ వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చిన మహిళపై దౌర్జన్యం చేశారు కర్ణాటకకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే. బెంగళూరు నగరంలోలో భాగంగా ఉన్న మహదేవపుర నియోజవర్గానికి అరవింద్ లింబావలి ఎమ్మెల్యేగా ఉన్ారు. ఆయన నియోజకవర్గంలో పర్యటిస్తున్న సమయంలో ఓ మహిళ వినతి పత్రంతో అక్కడకు వచ్చారు. అయితే ఆ మహిళతో ఎమ్మెల్యే దురుసుగా ప్రవర్తించారు.  వినతి పత్రం తీసుకుని చించేశారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.



ఎమ్మెల్యే అంతటితో వదిలి పెట్టలేదు. వైట్ ఫీల్డ్ పోలీసులను పిలిచి ఆ మహిళపై కేసు పెట్టాలని ఆదేశించారు. ఆయన  అధికార పార్టీ ఎమ్మెల్యే కావడంతో పోలీసులు చెప్పినట్లే చేశారు. ఆమెపై కేసు పెట్టి స్టేషన్‌ కు తీసుకెళ్లారు. 



అ మహిళ తన ఇంటి  గోడను అక్రమంగా కూల్చేశారని..  ఈ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లాలనుకున్నారు. అయితే ఆమె కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరురాలు కావడంతో ఎమ్మెల్యే ఇలా చేసినట్లుగా తెలుస్తోంది.