J&K: శ్రీనగర్‌లో భద్రతాదళాల ఎన్‌కౌంటర్- ఇద్దరు ఉగ్రవాదులు హతం

ABP Desam   |  Murali Krishna   |  10 Apr 2022 06:15 PM (IST)

శ్రీనగర్‌లో భద్రతా దళాలు జరిపిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.

శ్రీనగర్‌లో భద్రతాదళాల ఎన్‌కౌంటర్- ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్ముకశ్మీర్ శ్రీనగర్‌లో ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించినట్లు కశ్మీర్ జోన్ పోలీసులు ప్రకటించారు. మృతి చెందిన ఉగ్రవాదులు పాకిస్థాన్ నిషేధిత తీవ్రవాద సంస్థ లష్కర్ ఏ తొయిబాకు చెందినవారిగా గుర్తించారు.

ఏం జరిగింది?

కశ్మీర్‌లోని సిర్హామా ప్రాంతంలో తీవ్రవాదులు ఉన్నట్లు భద్రతా దళాలకు సమాచారం వచ్చింది. ఆ తర్వాత ప్రాంతంలో భద్రతా దళాలు గాలింపు చేపట్టాయి. దీంతో తీవ్రవాదులు పోలీసులపై కాల్పులు ప్రారంభించారు. వెంటనే భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. వీరి నుంచి కొన్నిఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పౌరులు, జర్నలిస్టులపై దాడులకు తెగబడితే సహించబోమని కశ్మీర్ జోన్ ఐజీపీ అన్నారు.

ఏప్రిల్ 4న సీఆర్​పీఎఫ్ జవాన్లపై దాడి జరిపిన ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టాము. ముందస్తు సమాచారంతో బిషేంబర్ నగర్​లో సోదాలు చేశాము. ఆ సమయంలో బలగాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందారు. ఉగ్రవాదుల గ్రనేడ్​ దాడి కారణంగా ముగ్గురు జవాన్లు గాయపడ్డారు.                                 -  విజయ్ కుమార్​, కశ్మీర్​ ఐజీపీ

Also Read: Watch Video: 'ధూమ్' లెవల్‌లో చేజింగ్- రన్నింగ్ వాహనం నుంచే ఆవులను తోసేసిన దొంగలు, వీడియో చూశారా?

Also Read: Covid 19 Precaution Dose: ప్రికాషన్ డోసు షురూ- ఎలా బుక్ చేసుకోవాలి? ధర తెలుసుకోండి

Published at: 10 Apr 2022 06:12 PM (IST)
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.