International Yoga Day 2022: యోగా దినోత్సవం సందర్భంగా హిమాలయ పర్వతాలపై ఇండో- టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) జవాన్లు యోగాసనాలు వేశారు.






లద్దాఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అసోంలతో పాటు భారత్-చైనా సరిహద్దుల్లో ఐటీబీపీ జవాన్లు యోగా చేశారు. లద్దాఖ్ ప్రాంతంలోని 17 వేల అడుగుల ఎత్తున్న హిమాలయాలపై ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసులు యోగా చేశారు.


ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసుకి చెందిన హిమవీరులు సిక్కింలో గడ్డ కట్టే మంచులో 16 వేల 500 అడుగుల ఎత్తులో యోగా సాధన చేశారు. ఈ ఏడాది యోగా ఫర్​ హ్యుమానిటీ అనే థీమ్​తో యోగా డే నిర్వహిస్తున్నారు.














అసోం గువాహటిలో బ్రహ్మపుత్ర నది ఎదుట నిర్వహించిన యోగా కార్యక్రమంలో 33 బెటాలియన్​ ఐటీబీపీ జవాన్లు.


Also Read: Covid Update: హమ్మయ్యా! దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు- 17 మంది మృతి


Also Read: Modi Speech on Yoga Day: యోగా జీవితంలో భాగం కాదు, జీవన మార్గం: మోదీ - మైసూరులో 15 వేల మందితో ఆసనాలు