ఇండిగో ఎయిర్ హోస్టెస్ అయాత్.. శ్రీ లంక పాట.. 'మానికే మాగే హితే'కు విమానంలో డ్యాన్స్ చేసి బాగా పాపులర్ అయింది. అయత్ ఇప్పుడు తాజాగా మరో వీడియోను తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసింది. ఇందులో జుగ్ను పాటకు డ్యాన్స్ చేసింది. 


ర్యాపర్ బాద్‌షా మరియు నిఖితా గాంధీ పాడిన జుగ్ను పాట సోషల్ మీడియాలో వైరల్ అయింది.  ఈ పాటకు ఎయిర్ హోస్టెస్ అయత్ స్టేప్పులు వేసింది. నల్లటి ఫుల్ స్లీవ్ టాప్ మరియు స్కర్ట్ ధరించి వేసిన స్టేప్పులు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.


“జుగ్ను! ఫివర్ స్టిల్ ఈజ్ ఆన్.. అని తన పోస్టకు అయత్ క్యాప్షన్ పెట్టింది. 






ఈ వీడియోకి ఇప్పటివరకు 1.5 లక్షలకు పైగా వీక్షణలు వచ్చాయి. 'అద్భుతమైన డ్యాన్స్' అని ఒకకు కామెంట్ చేయగా..  "మీరు నిజంగా మంచి డాన్సర్," అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు. ఇదిలా ఉంటే, అయత్ ఇంతకు ముందు చేసిన మానికే మాగే హితే  వీడియోగు 72 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.  


"జుగ్ను" అనే పాటను ఇటీవలే విడుదల చేశాడు ప్రముఖ ర్యాపర్ బాద్ షా. ఈ ట్రాక్‌లో నిఖితా గాంధీ వాయిస్ కూడా ఉంది. వీడియోలో ఆకాంక్ష శర్మ  నటించింది. 


అంతేకాదు.. బాలీవుడ్ లో  'బచ్ పన్ కా ప్యార్' సాంగ్ ను ర్యాపర్ బాద్ షా  రీక్రియేట్ చేసి  రిలీజ్ చేయగా.. యూట్యూబ్‌లో  టాప్ ట్రెండింగ్‌లో నిలిచింది. ఈ పాట స్పెషాలిటీ ఏంటంటే.. పదేళ్ల పిల్లాడు సచ్ దేవ్ దర్దోతో ఈ పాట పాడించారు. సచ్ దేవ్ వాయిస్‌తోనే ఈ పాట మొదలైంది. ఆ తరువాత బాద్ షా అందుకొని పాట రేంజ్‌ని మరింత పెంచారు. 


Also Read: Allu Arjun: 'నేనూ తమిళోడినే..' తన స్పీచ్ తో ఆకట్టుకున్న బన్నీ.. 


Also Read: Guppedantha Manasu Serial December 14th Episode: తొలిచూపులోనే వసుధారకి పడిపోయిన గౌతమ్, రిషిని హెల్ప్ చేయమంటూ షాకింగ్ ట్విస్ట్..


Also Read: Karthika Deepam December 14th Episode: కార్తీకదీపం సీరియల్ లో ఈ రోజు షాకింగ్ ట్విస్ట్.. మోనిత బిడ్డ మాయం, రుద్రాణిని లాగిపెట్టి కొట్టిన దీప, హర్ట్ అయిన డాక్టర్ బాబు..