Corona Cases: దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రితం రోజుతో పోలిస్తే మళ్లీ పెరిగాయి. కొత్తగా16,906 కరోనా కేసలు నమోదయ్యాయి. 45 మంది మృతి చెందారు. తాజాగా 15,447 మంది కరోనా నుంచి కోలుకున్నారు.






రికవరీ రేటు 98.51 శాతానికి పడిపోయింది. మొత్తం కేసుల్లో యాక్టివ్​ కేసుల సంఖ్య 0.29 శాతం ఉంది.



  • డైలీ పాజిటివిటీ రేటు: 3.68 శాతం 

  • మొత్తం మరణాలు: 5,25,519

  • యాక్టివ్​ కేసులు: 1,32,457

  • కోలుకున్నవారి సంఖ్య: 4,30,11,874


వ్యాక్సినేషన్






దేశంలో తాజాగా 11,15,068 మందికి టీకాలు అందించారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 1,99,12,79,010కు చేరింది. మరో 4,59,302 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.


కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్రం.. రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కరోనా నిబంధనలను తప్పకుండా పాటించేలా చూడాలని తెలిపింది. కరోనా టెస్టులను పెద్ద ఎత్తున నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. మాస్కులు తప్పనిసరిగా వినియోగించాలని కోరింది. మరోవైపు వ్యాక్సినేషన్ కార్యక్రామాన్ని కూడా వేగంగా కొనసాగించాలని నిర్ణయించింది కేంద్ర ఆరోగ్య శాఖ


కరోనా ఫోర్త్ వేవ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే పలు రిపోర్ట్‌లు వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో భారత్‌లో కూడా ఫోర్త్ వేవ్ వచ్చే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 


Also Read: President Murmu : ఎన్డీఏ అభ్యర్థికి అనూహ్యమైన మద్దతు - ద్రౌపది ముర్ముకు భారీ ఆధిక్యం ఖాయమే !


Also Read: Presidential Election 2022 : ఎన్డీఏ అభ్యర్థికే శివసేన మద్దతు - రాష్ట్రపతి ఎన్నికలపై ఉద్దవ్ ధాకరే కీలక నిర్ణయం !