వాస్తవాధీన రేఖ వెంబడి శాంతి, సుస్థిరతల కోసం ఇప్పటికే చైనాతో పలు అవగాహన ఒప్పందాలు చేసుకున్నాం. కానీ ఇలా ఏకపక్షంగా సరిహద్దు ఒప్పందాలపై ప్రభావం చూపే అవకాశం ఉన్న చట్టాన్ని చైనా ఆమోదించడం ఆందోళనకరం. ఈ చట్టం ప్రకారం సరిహద్దులో చైనా ఎలాంటి చర్యలు చేపట్టకూడదని భారత్ ఆశిస్తోంది. ఎందుకంటే అలా చేస్తే సరిహద్దులో మళ్లీ ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉంది.                                                  -    అరిందమ్ బాగ్చీ, విదేశాంగ శాఖ ప్రతినిధి