Birbhum Violence: సభలో కన్నీరు పెట్టిన మహిళా ఎంపీ- జీవించే హక్కు లేదా అంటూ ఆవేదన

ABP Desam Updated at: 25 Mar 2022 07:53 PM (IST)
Edited By: Murali Krishna

బంగాల్‌లో జరిగిన హింసాత్మక ఘటనపై మాట్లాడుతూ పార్లమెంటులో కన్నీరు పెట్టారు భాజపా ఎంపీ రూపా గంగూలీ.

సభలో కన్నీరు పెట్టిన మహిళా ఎంపీ- జీవించే హక్కు లేదా అంటూ ఆవేదన

NEXT PREV

బంగాల్‌ బీర్భూమ్‌లో జరిగిన హింసాత్మక ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఘటనను భాజపా ఎంపీలు పార్లమెంటులో ప్రస్తావించారు. జీరో అవర్‌లో జరిగిన చర్చలో ఈ ఘటనపై భాజపా ఎంపీ రూపా గంగూలీ మాట్లాడారు. అయితే మాట్లాడే సమయంలో ఆమ ఉద్వేగానికి లోనై ఒక్కసారిగా కన్నీరు పెట్టుకున్నారు. ఈ వీడియో వైరల్ అవుతోంది.







బంగాల్​ రాష్ట్రంలో దారుణ హత్యలు జరుగుతున్నాయి. బంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తున్నాం. అటాప్పీ రిపోర్ట్‌ ప్రకారం చనిపోయిన వారిని మొదట దారుణంగా కొట్టారు. ఆ తర్వాత సామూహిక హత్య చేశారు. భార‌త్‌లో బంగాల్ కూడా భాగం. అక్క‌డ జీవించే హ‌క్కు ఉంది. మేం బంగాల్‌లో పుట్టాం. అక్క‌డ పుట్ట‌డం త‌ప్పుకాదు. కానీ అక్కడున్న ప్రజలు ప్రశాంతంగా జీవించలేకపోతున్నారు.                                                               - రూపా గంగూలీ, భాజపా ఎంపీ


మరోవైపు ఆమె ఈ విషయంపై మాట్లాడుతున్న సమయంలో తృణముల్‌ కాంగ్రెస్‌ ఎంపీలు సభలో గందరగోళం సృష్టించారు. అయినప్పటికీ ఆమె ఉద్వేగపూరితంగా మాట్లాడారు.


దారుణం


బీర్భూమ్ జిల్లా రాంపుర్ హట్ పట్టణానికి సమీపంలో ఉన్న బగ్టుయి గ్రామంలో దుండగులు మంగళవారం హింసాకాండకు పాల్పడ్డారు. ఓ ఇంటిలో ఉన్న ఎనిమిది మందిని సజీవ దహనం చేశారు. అంతకుముందు వీరిని తీవ్రంగా కొట్టినట్లు పోస్ట్‌మార్టం నివేదిక వెల్లడించింది. ఈ హింసాకాండలో దాదాపు 12 ఇళ్ళను తగులబెట్టారు. టీఎంసీ నేత భడు షేక్ హత్యానంతరం ఈ హింసాకాండ జరిగింది.


ఈ కేసులకు సంబంధించి పోలీసులు 23 మందిని అరెస్టు చేశారు. షేక్‌ను హత్య చేయడానికి బాంబు దాడి చేసిన వ్యక్తి కూడా అరెస్టయిన వారిలో ఉన్నాడు. ఈ హింసాకాండలో మరణించినవారి మృతదేహాలకు నిర్వహించిన పోస్ట్‌మార్టమ్ నివేదిక ప్రకారం, మొదట వీరిని తీవ్రంగా కొట్టి, హింసించి, ఆ తర్వాత సజీవ దహనం చేసినట్లు  తెలుస్తోంది. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు బాలలు ఉన్నారు. 


Also Read: UP CM Yogi Adityanath: ఉత్తర్‌ప్రదేశ్ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణం- కిక్కిరిసిన స్టేడియం


Also Read: Birbhum Violence Case: బంగాల్ హింసాకాండపై సీబీఐ దర్యాప్తు- కలకత్తా హైకోర్టు కీలక నిర్ణయం

Published at: 25 Mar 2022 07:53 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.