Agnipath Scheme Protests India: త్రివిధ దళాల్లో నాలుగేళ్ల పాటు పనిచేసేందుకు సైనికుల నియామకానికి కేంద్రం తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. బిహార్, ఉత్తర్‌ప్రదేశ్‌లో మొదలైన ఈ నిరసన జ్వాలలు తాజాగా మరిన్ని రాష్ట్రాలకు వ్యాపించాయి. 


7 రాష్ట్రాల్లో




    • తెలంగాణ, బిహార్, మధ్యప్రదేశ్, హరియాణా, రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్, దిల్లీలలో ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. సికింద్రాబాద్, బిహార్‌లలో పలుచోట్ల నిరసనకారులు రైళ్లను తగలబెట్టారు. మరికొన్ని చోట్ల బస్సు అద్ధాలను ధ్వంసం చేశారు. 







    • బిహార్‌లో ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి రేణు దేవి ఇంటిపై నిరసనకారులు దాడి చేశారు. పశ్చిమ చంపారాన్ జిల్లాలోని ఆమె ఇంటికి నిప్పంటించారు

    • బిహార్‌లో అనేక ప్రాంతాల్లో  యువత రైలు పట్టాలపై బైఠాయించారు. ట్రాకులు ధ్వంసం చేశారు. కొన్ని రైళ్లను తగలబెట్టారు. అనేక ప్రధానమైన రహదారులను దిగ్బంధించారు.

    • సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ఆందోళనకారులు విధ్వంసం సృష్టించారు. మూడు రైళ్లను, 40 బైకులను తగులబెట్టారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో ఓ ఆందోళనకారుడు మృతి చెందాడు. 

    • ఉత్తర్‌ప్రదేశ్‌లో శుక్రవారం ఉదయమే బల్లియా రైల్వే స్టేషన్‌లోకి అడుగుపెట్టిన ఆందోళనకారులు ఓ రైలుకి నిప్పంటించారు. రైల్వే స్టేషన్ ఆస్తులను ధ్వంసం చేశారు.

    • భాజపా పాలిత రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, హరియాణాల్లోనూ తీవ్ర స్థాయిలో నిరసనలు చెలరేగాయి.






  • బంగాల్‌లోని సిలిగురిలో విద్యార్థులు రోడ్డుపై ధర్నా చేపట్టారు.


Also Read: Agnipath Protests In Hyderabad: అగ్గి రాజేసిన ఆందోళనలు- సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ధ్వంసం, పలు రైళ్లకు నిప్పు


Also Read: Agneepath Scheme: ఈ దేశాల్లోనూ అగ్నిపథ్ తరహా పథకం, అక్కడ ఎలా అమలు చేస్తున్నారో తెలుసా