2022 ఏడాదిలో ఇప్పటికే ప్రపంచం కరోనా థర్డ్ వేవ్‌ను చూసింది. మూడో ప్రపంచ యుద్ధం ముప్పును ఎదుర్కొంటోంది. అలానే భారత్.. ఉత్కంఠభరితమైన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూసింది. ప్రస్తుతం మనం ఓ అనిశ్చితమైన, ఉద్వేగపూరిత వాతావరణంలో ఉన్నాం. కానీ అలానే లెక్కలేనన్ని అవకాశాల మధ్య కూడా ఉన్నాం. ఇలాంటి వేళ దేశానికి కావాల్సిన గొప్ప ఆలోచనలను ముందుకు తీసుకువెళ్లేందుకు మనం సిద్ధంగా ఉన్నాం. ఏ అంశంపైనైనా చర్చించేందుకు, వాదించేందుకు, నిజం తెలుసుకునేందుకు దేశం సిద్ధంగా ఉంటుంది. ABP నెట్‌వర్క్‌ కూడా అదే నమ్ముతుంది. ఎప్పుడూ నిజం వైపు నిలబడేందుకే మేం కృషి చేస్తాం. టీఆర్‌పీల వెంట మేం పరుగుపెట్టం. ప్రజల హృదయాలను కదిలించాలని చూస్తాం. మాకు ఎంతమంది వీక్షకులు ఉన్నారని మేం ఎప్పుడూ ఆలోచించలేదు. వారిని ఆకట్టుకోవడానికే ప్రయత్నించాం. న్యూస్.. జీవితాలను మార్చగలదు.                                                                    - అవినాశ్ పాండే, ABP నెట్‌వర్క్ సీఈఓ