ABP-CVoter Opinion Poll 2024: న్యూఢిల్లీ: త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలపై ABP న్యూస్ CVoter ఒపీనియన్ పోల్ నిర్వహించింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్‌కు లోక్‌సభ ఎన్నికల్లో భారీ షాక్ తగలనుంది. బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) మొత్తం 28 లోక్‌సభ స్థానాలకుగానూ 23 సొంతం చేసుకోనుండగా, I.N.D.I.A కూటమి 5 సీట్లకు పరిమితం కానుంది తాజా సర్వేలో తేలింది. 


ఎవరికి ఎంత శాతం ఓటింగ్.. 
ABP News CVoter కర్ణాటకలో నిర్వహించిన ఒపీనియన్ పోల్ తాజా సర్వే ప్రకారం.. బీజేపీ 21 సీట్లు, జనతాదళ్- సెక్యులర్ (JDS) 2 సీట్లు, కాంగ్రెస్ 5 స్థానాల్లో నెగ్గనుంది. కర్ణాటకలో లోక్‌సభ ఎన్నికలు రెండు దశల్లో జరగనున్నాయి. ఏప్రిల్ 26న, మే 7న పోలింగ్ నిర్వహించడానికి ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. కర్ణాటకలో ఎన్డీఏ కూటమికి 52 శాతం ఓట్లు పోల్ కానుండగా, కాంగ్రెస్ నేతృత్వంలోని  I.N.D.I.A కూటమికి 42 శాతం ఓట్లు రానున్నాయి. 


లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏదే హవా.. 
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందినా పార్లమెంట్ ఎన్నికల్లో తమదే పైచేయి అని బీజేపీ ధీమాగా ఉంది. బీజేపీ ఇప్పటికే కర్ణాటకలోని 20 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. బెల్గాం నుంచి జగదీష్ షెట్టర్, హవేరి నుంచి బసవరాజ్ బొమ్మై, ధార్వాడ్ నుంచి ప్రహ్లాద్ జోషి, బెంగళూరు సౌత్ నుంచి తేజస్వి సూర్య బరిలోకి దిగారు. ఎన్డీయే నుంచి ముగ్గురు మాజీ సీఎంలు కర్ణాటకలో లోక్‌సభ ఎన్నికల్లో నిలిచారు. బొమ్మై (హవేరి), జగదీష్ షెట్టర్ (బెల్గాం), కుమారస్వామి (మాండ్య) నుంచి తమ గెలుపు ఖాయమంటున్నారు. జనతా పరివార్ అగ్రనేత దివంగత ఎస్‌ఆర్‌ బొమ్మై కుమారుడు బొమ్మై హవేరి ఎన్నికల బరిలో నిలిచారు. 'అబ్కీ బార్, ఛార్ సౌ పార్' ఈసారి 400 సీట్లు నెగ్గుతామని బీజేపీ నేతలు ధీమాగా ఉన్నారు. కేంద్రంలో వరుసగా మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతుందని, ప్రధానిగా మోదీ హ్యాట్రిక్ కొడతారని కాషాయ నేతలు చెబుతున్నారు.


కాంగ్రెస్ సైతం బలమైన నేతల్ని బరిలో నిలిపి లోక్‌సభ స్థానాలను కైవసం చేసుకోవాలని ప్లాన్ చేస్తోంది.  ప్రియాంక జార్కిహోళి, సంయుక్త ఎస్ పాటిల్, మృణాల్ రవీంద్ర హెబ్బాల్కర్, రాధాకృష్ణ, హెచ్ ఆర్ అల్గూర్, సాగర్ ఖండ్రే, కె. రాజశేఖర్ బసవరాజ్ హిట్నాల్, ఆనందస్వామి గడ్డదేవర, జి కుమార్ నాయక్, అంజలి నింబాల్కర్‌తో కాంగ్రెస్ అభ్యర్థులకు ఛాన్స్ ఇచ్చింది. కర్ణాటకలో కాంగ్రెస్ హవా లేదని కాంగ్రెస్ అత్యధిక లోక్ సభ సీట్లు నెగ్గుతుందన్నారు సీఎం సిద్ధరామయ్య. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని వ్యతిరేకించిన బీజేపీకి కర్ణాటక ప్రజలు ఓట్లు వేసేది లేదన్నారు. కానీ ఏబీపీ న్యూస్ సీఓటర్ తాజాగా నిర్వహించిన ఒపీనియన్ పోల్ మాత్రం ఎన్డీఏ రాష్ట్రంలో మెజార్టీ స్థానాలు కైవసం చేసుకుందని తేల్చింది.


(Methodology: Current survey findings and projections are based on CVoter Opinion Poll CATI interviews (Computer Assisted Telephone Interviewing) conducted among 18+ adults statewide, all confirmed voters, details of which are mentioned right below the projections as of today. The data is weighted to the known demographic profile of the States. Sometimes the table figures do not sum to 100 due to the effects of rounding. Our final data file has Socio-Economic profile within +/- 1% of the Demographic profile of the State. We believe this will give the closest possible trends. The sample spread is across all Assembly segments in the poll bound state. MoE is +/- 3% at macro level and +/- 5% at micro level VOTE SHARE projection with 95% Confidence interval.)